Tata Sons: త్వరలో ఐపీవోకు టాటా సన్స్..? ఆర్బీఐ కొత్త నిబంధనలతో కీలక మార్పులు
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో అతిపెద్ద వ్యాపార సమూహాల్లో ఒకటైన టాటా సన్స్ త్వరలో ఐపీవోకు వెళ్లాల్సి రావొచ్చనే చర్చ మొదలైంది. ఆర్బీఐ తాజాగా షాడో లెండర్లపై కొత్త నిర్వచనం తీసుకురావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, గ్రూప్ కంపెనీలు లేదా అనుబంధ సంస్థల నుంచి డబ్బులు తీసుకునే సంస్థలను కూడా పరోక్షంగా ప్రజల నిధులకు యాక్సెస్ ఉన్నవిగా పరిగణిస్తారు. దీంతో టాటా సన్స్పై నియంత్రణ మరింత కఠినమయ్యే అవకాశం ఉంది. ఈ మార్పులు జూలై 1 నుంచి అమల్లోకి రానుండగా, ఇప్పటికే "అప్పర్ లేయర్" కేటగిరీలో ఉన్న టాటా సన్స్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడొచ్చు.
వివరాలు
ఆ గడువును మిస్ చేసుకున్న టాటా సన్స్
టాటా గ్రూప్లోని ఏడు కంపెనీలు కలిసి సుమారు 12శాతం వాటా టాటా సన్స్లో కలిగి ఉన్నాయని InGovern Research Services వ్యవస్థాపకుడు శ్రీరామ్ సుబ్రమణియన్ తెలిపారు. ఈ కంపెనీలు తీసుకున్న అప్పులు టాటా సన్స్కు పరోక్షంగా ప్రజల నిధుల యాక్సెస్గా పరిగణించవచ్చని ఆయన అభిప్రాయం. 2025 సెప్టెంబర్లోనే పబ్లిక్ కావాల్సి ఉన్న టాటా సన్స్ ఆ గడువును మిస్ చేసింది. ఇదిలా ఉండగా,పబ్లిక్ లిస్టింగ్ చేస్తే మార్కెట్ పర్యవేక్షణ,మైనారిటీ షేర్హోల్డర్ల హక్కులు, గ్రూప్లోపలి లావాదేవీలపై పరిమితులు పెరుగుతాయి. మరోవైపు, Shapoorji Pallonji Mistry నేతృత్వంలోని షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ ఇప్పటికే టాటా సన్స్ లిస్టింగ్పై ఒత్తిడి పెంచుతోంది. ఇన్వెస్టర్లకు పూర్తి విలువ దక్కాలంటే ఐపీవో తప్పనిసరి అని వారు ఆర్బీఐకి విజ్ఞప్తి చేశారు.