Page Loader
2023లో ద్రవ్య విధానం వలన భారతదేశ ఎగుమతులు దెబ్బతినే అవకాశం
భారత్ ఆర్థిక వ్యవస్థ 2023లో 6.1 శాతం వృద్ధి ఉంటుందని అంచనా

2023లో ద్రవ్య విధానం వలన భారతదేశ ఎగుమతులు దెబ్బతినే అవకాశం

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 23, 2023
07:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

గ్లోబల్ డిమాండ్‌ దెబ్బతినడం ప్రారంభమయ్యాక కఠినమైన ద్రవ్య విధానం కారణంగా ఏప్రిల్ 1, 2023 నుండి వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఎగుమతులు దెబ్బతినే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ నెలవారీ ఆర్థిక నివేదికలో 2022లో ప్రపంచ వాణిజ్య వృద్ధి పడిపోయిందని, 2023లో ఈ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని, వాణిజ్య విలువ మరింత తగ్గుతుందని పేర్కొంది. ప్రపంచ వృద్ధిలో క్షీణతను వివిధ ఏజెన్సీలు అంచనా వేశారు కాబట్టి ఇది 2023లో కొనసాగవచ్చని పేర్కొంది. కానీ ఎగుమతుల దృక్పథాన్ని బలహీనపరిచెది ఇది ఒక్కటే కాదు. ఉక్రెయిన్-రష్యా వివాదం కారణంగా పెరుగుతున్న మాంద్యం, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత భయాలు వంటి ఇతర అంశాలు వలన కూడా ప్రపంచ వృద్ధి మందగిస్తుంది.

భారతదేశం

అంతర్జాతీయ ద్రవ్య నిధి 2023లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 6.1 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసింది

ఎగుమతి వృద్ధి తక్కువగా ఉన్నప్పటికీ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మారుతుందని నివేదిక పేర్కొంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి 2023లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 6.1 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేయగా, ప్రపంచ బ్యాంకు దేశ జిడిపిని 6.6 శాతంగా అంచనా వేసింది. ఎగుమతులపై కాకుండా, అభివృద్ధి చెందుతున్న ద్రవ్యోల్బణతో సహా అనేక అంశాలపై వృద్ధి ఆధారపడి ఉంటుంది. నవంబర్, డిసెంబర్‌లలో ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగువ సహన పరిమితి 6 శాతంలో ఉంది, జనవరిలో 6.52 శాతానికి పెరిగింది. ఇది ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఆర్‌బిఐ కఠినమైన ఆర్థిక విధానాన్ని కొనసాగించాలని తెలియజేస్తుంది కానీ చివరికి ఆర్థిక వృద్ధి మందగిస్తుంది.