LOADING...
Mahesh babu: 25 ఏళ్ల 'మురారి': కథ వెనుక ఉన్న మైథలాజికల్‌ మంత్రం
25 ఏళ్ల 'మురారి': కథ వెనుక ఉన్న మైథలాజికల్‌ మంత్రం

Mahesh babu: 25 ఏళ్ల 'మురారి': కథ వెనుక ఉన్న మైథలాజికల్‌ మంత్రం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 18, 2026
01:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

సూపర్‌స్టార్‌ మహేష్ బాబు కథానాయకుడిగా, దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'మురారి' ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సోనాలి బింద్రే కథానాయికగా నటించిన ఈ సినిమా 2001 ఫిబ్రవరి 17న విడుదలై బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా విడుదలై నేటికి 25 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా 'మురారి' కథ ఎలా రూపుదిద్దుకుంది? ఆ పేరును ఎందుకు ఎంపిక చేశారు? వంటి ఆసక్తికర విషయాలను దర్శకుడు కృష్ణవంశీ ఓ సందర్భంలో వెల్లడించారు. సాధారణంగా సినిమాల్లో హీరో-విలన్‌ పోరాటం ఉంటుందని, కానీ ఈ చిత్రంలో విలన్‌ ఒక వ్యక్తి కాకూడదని భావించినట్లు ఆయన తెలిపారు.

వివరాలు 

అందుకే ఆ పాత్రకు 'మురారి' అనే పేరు

''ఈసారి ఎదురయ్యేది మనిషి కాదు, ఒక శక్తి. ఆ శక్తిని ఎలా జయించాలో ఎవరికీ ముందుగా తెలియకూడదు. చివరి నిమిషం వరకూ ప్రేక్షకుడిలో ఉత్కంఠ కొనసాగాలి. హీరో ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడతాడన్న ఆసక్తి చివరి వరకూ ఉండాలనే ఉద్దేశంతో కథను తీర్చిదిద్దాం. ప్రజలకు, ప్రపంచానికి మేలు చేసే ఓ దేవత కోపానికి కారణమైన వ్యక్తి, ఆ శాపం నుంచి ఎలా విముక్తి పొందాడన్న అంశం చుట్టూ 'మురారి' కథను అభివృద్ధి చేశాం. ఈ కథలో మన సంస్కృతి, సంప్రదాయాలు కూడా ప్రతిబింబించేలా చూసాం. అప్పట్లో మహేశ్‌బాబు రూపం ఎంతో ఆకర్షణీయంగా ఉండేది.ఆయనను చూస్తే బృందావనం గుర్తుకొచ్చింది.అందుకే ఆ పాత్రకు 'మురారి' అనే పేరు పెట్టాం''అని కృష్ణవంశీ వివరించారు.

వివరాలు 

పాటను క్లైమాక్స్‌కు ముందు పెట్టడంపై అప్పట్లో పెద్ద చర్చ

సినిమా కథ మాత్రమే కాకుండా, సంగీత పరంగానూ 'మురారి' మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రానికి మణిశర్మ అందించిన పాటలు ఇప్పటికీ శ్రోతల హృదయాల్లో నిలిచిపోయాయి. ముఖ్యంగా 'అలనాటి రామచంద్రుడి...' పాట పెళ్లి వేడుకల్లో ఇప్పటికీ మారుమోగుతూనే ఉంది. అయితే, ఈ పాటను క్లైమాక్స్‌కు ముందు పెట్టడంపై అప్పట్లో పెద్ద చర్చే జరిగిందని కృష్ణవంశీ తెలిపారు.

Advertisement

వివరాలు 

మహేశ్‌బాబుకు మొహమాటం.. కృష్ణ గారు ఏమన్నారేంటే.. 

''మురారి'కి ముందు మహేశ్‌బాబుకు వరుసగా రెండు ఫ్లాప్‌లు వచ్చాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సాధారణంగా తెలుగు కమర్షియల్‌ సినిమాల్లో క్లైమాక్స్‌కు ముందు ఓ మాస్‌ పాట ఉండాలి. కానీ, నేను 'అలనాటి రామచంద్రుడి...' పాటను చివర్లో పెట్టాలని నిర్ణయించాను. చాలా మంది దీనికి వ్యతిరేకంగా మాట్లాడారు. మహేశ్‌బాబు కూడా మొహమాటంతో నేరుగా చెప్పలేని పరిస్థితి. ఒకసారి విషయం ప్రస్తావించాక ఆయన్ను ఒప్పించాను. అయితే విషయం కృష్ణగారి వరకూ వెళ్లింది. 'చివర్లో మాస్‌ సాంగ్‌ లేకపోవడం సరైంది కాదు, అనవసరంగా ప్రయోగం చేస్తున్నావు' అని ఆయన అన్నారు'' అని కృష్ణవంశీ గుర్తు చేసుకున్నారు.

Advertisement

వివరాలు 

సినిమా విడుదలైన తర్వాత ఆ పాటకు అందరూ ప్రశంసలు

''సర్‌ ఇప్పుడు మన ముందు రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఇప్పుడు రెండు మార్గాలే ఉన్నాయి. ఒకటి - ఈ సినిమాను, ఈ పాటతో పాటు నన్నే చేయనివ్వాలి. లేదంటే ఈ సినిమాను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోతా. మీరు కమర్షియల్‌ సాంగ్‌ వేసుకుని విడుదల చేసుకోండి. నా పేరు కూడా వేయొద్దు. ఎందుకంటే నేను చేస్తున్న ఈ పాట దశాబ్దాల పాటు నిలిచిపోతుంది. మీ అబ్బాయి కెరీర్‌ కోసం కావాలంటే ఆ మాస్‌ పాట పెట్టుకోండి'' అని చెప్పానని ఆయన వెల్లడించారు. చివరకు కృష్ణగారు ఒప్పుకున్నారని, సినిమా విడుదలైన తర్వాత ఆ పాటకు అందరూ ప్రశంసలు కురిపించారని కృష్ణవంశీ తెలిపారు.

Advertisement