Guntur Kaaram: నెట్టింట్లో దుమ్మురేపుతున్న మహేష్ బాబు'కుర్చీ మడతపెట్టి' సాంగ్
గుంటూరు కారం సినిమాతో మహేష్ బాబు ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఈచిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలోని కుర్చీ మడతపెట్టి అనే మాస్ సాంగ్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో ఈ పాటకి వన్ మిలియన్ కి పైగా రీల్స్ వచ్చాయి. ఈ పాటకి ఫాన్స్ అద్దిరిపోయే స్టెప్పులు వేస్తూ ఈ పాట ను వైరల్ చేస్తున్నారు . మీనాక్షి చౌదరి, రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్, జయరామ్, జగపతి బాబు, ఈశ్వరి రావు ఇందులో కీలక పాత్రల్లో నటించారు.