Loading...
NBK 112: బాలయ్య-కొరటాల మూవీలో ఐశ్వర్య రాజేశ్..? ఈసారి విలన్‌గా కనిపించనున్నారా!
బాలయ్య-కొరటాల మూవీలో ఐశ్వర్య రాజేశ్..? ఈసారి విలన్‌గా కనిపించనున్నారా!

NBK 112: బాలయ్య-కొరటాల మూవీలో ఐశ్వర్య రాజేశ్..? ఈసారి విలన్‌గా కనిపించనున్నారా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 21, 2026
12:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో 'NBK112' వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'సంక్రాంతి వస్తున్నాం' చిత్రంలో భాగ్య పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఐశ్వర్య రాజేశ్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈసారి ఆమె హీరోయిన్‌గా కాకుండా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ప్రస్తుతం ఇవన్నీ ప్రచారంగానే కొనసాగుతున్నాయి.

వివరాలు

భారీ అంచనాల మధ్య NBK112

కొరటాల శివ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ సినిమాపై బాలయ్య అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇందులో బాలకృష్ణ లుక్ గత చిత్రాలకు భిన్నంగా ఉంటుందని సమాచారం. అలాగే ఆయన పాత్ర మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని, పూర్తి స్థాయి మాస్ అవతారంలో అభిమానులను అలరించనున్నారని టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమా కథను కొరటాల శివ ఎంతో పకడ్బందీగా సిద్ధం చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. యువసుధ ఆర్ట్స్, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ సీజన్‌లో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

వివరాలు

ఐశ్వర్య రాజేశ్ కెరీర్‌లో మంచి ఫామ్

తమిళ, తెలుగు చిత్రాల్లో పలు స్టార్ హీరోల సరసన నటించిన ఐశ్వర్య రాజేశ్, 'కౌసల్య కృష్ణమూర్తి', 'రిపబ్లిక్', 'వరల్డ్ ఫేమస్ లవర్', 'టక్ జగదీశ్' వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

అయితే 'సంక్రాంతి వస్తున్నాం' చిత్రంలో భాగ్య పాత్ర ఆమె కెరీర్‌కు మంచి బూస్ట్ ఇచ్చింది.

ముఖ్యంగా వెంకటేష్‌తో కలిసి ఆమె చేసిన నటన సినిమాకే హైలైట్‌గా నిలిచింది.

ఇటీవల ఓటీటీలో విడుదలైన 'ఇసకపట్నం' చిత్రంలో కూడా ఆమె కీలక పాత్రలో మెప్పించారు. అలాగే యంగ్ హీరో తిరువీర్‌తో కలిసి నటించిన 'ఓ సుకుమారి' చిత్రం కూడా ఇటీవల విడుదలై థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.

ADVERTISEMENT

వివరాలు

'సింహా' మ్యాజిక్‌ను మళ్లీ కోరుకుంటున్న అభిమానులు

మరోవైపు బాలయ్య-కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అభిమానులు ప్రత్యేక ఆశలు పెట్టుకున్నారు.

ముఖ్యంగా 'సింహా' స్థాయి ఫ్యాక్షన్ ఎంటర్‌టైనర్ కావాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు చేస్తున్నారు. అలాంటి బ్యాక్‌డ్రాప్‌లో సినిమా వస్తే బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం ఖాయమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

దీనికి ప్రత్యేక కారణం కూడా ఉంది. గతంలో విడుదలైన బాలకృష్ణ 'సింహా' చిత్రానికి కొరటాల శివ రచనా సహకారం అందించారు.

ఆ చిత్రంలోని డైలాగ్‌లను కూడా ఆయనే రాశారు. ఇప్పుడు స్వయంగా కొరటాల దర్శకత్వం వహిస్తున్నందున, అదే స్థాయి మాస్, ఫ్యాక్షన్ ఎలిమెంట్స్‌తో సినిమా రూపొందించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ADVERTISEMENT

వివరాలు

ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో బాలయ్య సెంటిమెంట్

బాలకృష్ణ కెరీర్‌లో 'సమరసింహా రెడ్డి', 'నరసింహ నాయుడు', 'సింహా', 'వీరసింహారెడ్డి' వంటి ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ చిత్రాలు భారీ విజయాలు సాధించాయి.

ఈ కారణంగానే మరోసారి అదే తరహా కథతో కొరటాల శివ సినిమా తెరకెక్కిస్తే ఇండస్ట్రీ రికార్డులు సృష్టించే అవకాశముందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అయితే NBK112 అసలు ఏ జానర్‌లో తెరకెక్కుతోంది? ఐశ్వర్య రాజేశ్ నిజంగానే నెగెటివ్ పాత్రలో నటిస్తున్నారా? అనే విషయాలపై అధికారిక స్పష్టత రావాలంటే చిత్రబృందం నుంచి ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ADVERTISEMENT