
Akhil Akkineni: వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన అక్కినేని అఖిల్.. వైరల్ అవుతున్న ఫోటోలు
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా పేరొందిన అక్కినేని అఖిల్ వివాహబంధంలోకి అడుగుపెట్టాడు.
ఇప్పటివరకు బ్యాచిలర్గా ఉన్న అఖిల్, తన ప్రేయసి జైనబ్తో ఏడడుగులు వేసి జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు.
ఈ వివాహ వేడుక శుక్రవారం (జూన్ 6) తెల్లవారు జామున 3 గంటలకు జూబ్లీహిల్స్లోని నాగార్జున నివాసంలో ఘనంగా జరిగింది.
వివరాలు
అఖిల్, జైనబ్ దంపతులకు శుభాకాంక్షలు
సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ పెళ్లికి అఖిల్, జైనబ్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
సినీ పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి- సురేఖ దంపతులు, రామ్ చరణ్- ఉపాసన, దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో సుమంత్ తదితరులు పెళ్లికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
జూన్ 8న అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా అఖిల్, జైనబ్ దంపతులకు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన అక్కినేని అఖిల్
వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన @AkhilAkkineni8
— తార-సితార (@Tsr1257) June 6, 2025
Congratulations both of you..
happy marriage life 😍😍#AkhilWedding #AkhilZainab pic.twitter.com/S995RzyGce