
Allu Arjun 22: అల్లు అర్జున్-అట్లీ మూవీ.. ముంబయిలో తొలి షెడ్యూల్!
ఈ వార్తాకథనం ఏంటి
అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రానున్న భారీ ప్రాజెక్ట్ చుట్టూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా 'అల్లు అర్జున్ 22' సినిమాకు సంబంధించిన కొన్ని ముఖ్య అప్డేట్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి, వీటిని అభిమానులు కూడా పంచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రీ ప్రొడక్షన్ పూర్తి కాగానే షూటింగ్ ప్రారంభం కానుంది. తొలి షెడ్యూల్ను ముంబయిలో జరపాలని చిత్రయూనిట్ నిర్ణయించింది. దాదాపు మూడు నెలల పాటు అక్కడే షూటింగ్ కొనసాగనుందని వార్తలొస్తున్నాయి.
Details
కొత్త ప్రపంచాన్ని సృష్టించే పనిలో చిత్రబృందం నిమగ్నం
ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్ని ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నారు. తదుపరి షెడ్యూల్ పూర్తయిన వెంటనే సినిమా VFX పనులను ప్రారంభించనున్నారు. ఇందుకోసం టీమ్ మొత్తం అమెరికా వెళ్లనుందని సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రానుంది. సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమా బాలీవుడ్ అందాలతార దీపికా పదుకొణె హీరోయిన్గా నటించనుంది. సమాంతర ప్రపంచం, పునర్జన్మల కాన్సెప్ట్తో ముడిపడి ఉండే సైన్స్ఫిక్షన్ కథాంశంగా ఈ సినిమా రూపొందనుంది. దీనికోసం ప్రత్యేకంగా ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించే పనుల్లో చిత్రబృందం నిమగ్నమై ఉంది.