Raaka: భారీ లైనప్తో వస్తున్న అల్లు అర్జున్ మూవీ.. 'రాకా' రిలీజ్పై కొత్త బజ్..
ఈ వార్తాకథనం ఏంటి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా ఒక భారీ లైనప్ను సిద్ధం చేసుకున్నారు. అందులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రాజెక్ట్ 'రాకా'. కోలీవుడ్ దర్శకుడు అట్లీ తన స్టైల్ మాస్ ఎలిమెంట్స్తో, సన్ పిక్చర్స్ నిర్మాణంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రంపై ఫిల్మ్ నగర్లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. సాధారణంగా అట్లీ సినిమాలు అంటే భారీ స్థాయి మేకింగ్, విస్తృతమైన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఉంటుంది. అందువల్ల ఈ సినిమా 2027లో విడుదల కావడం కష్టమని కొందరు భావించారు. తాజా సమాచారం ప్రకారం, మూవీ విడుదల విషయంలో అట్లీ ఒక స్పష్టమైన, పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని తెలుస్తోంది.
వివరాలు
నలుగురు హీరోయిన్లతో ప్లాన్..
అల్లు అర్జున్ తన భాగం షూటింగ్ను ఈ ఏడాది చివరినాటికి పూర్తి చేయనున్నారని సమాచారం. ఆ తర్వాత 2027 రెండో భాగంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టీమ్ భావిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ల జాబితా చూస్తే నిజంగా ఆశ్చర్యం కలగక మానదు. గ్లోబల్ బ్యూటీ దీపికా పదుకొనే, 'దేవర' ఫేమ్ జాన్వీ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ వంటి నలుగురు అగ్ర కథానాయికలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
వివరాలు
బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడానికి సిద్ధం
ఇంతమంది స్టార్ నటీనటులు ఒకే ఫ్రేమ్లో ఉంటే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. అల్లు అర్జున్ సరసన వీరి పాత్రలు ఎలా ఉండబోతున్నాయన్నది ప్రస్తుతం పెద్ద సస్పెన్స్గా మారింది. దీంతో ఇది పీరియాడిక్ యాక్షన్ డ్రామా అని కొందరు, మరికొందరు ఇది పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా 'పుష్ప 2' తర్వాత అల్లు అర్జున్ నుంచి రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.