ప్రాజెక్ట్ కె షూటింగ్ లో అమితాబ్ కు ప్రమాదం, షూటింగ్ క్యాన్సిల్
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కు ప్రాజెక్ట్ కె షూటింగ్ లో యాక్సిడెంట్ అయ్యింది. యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు జరిగిన్ ప్రమాదంలో గాయాలు కావడంతో కుడివైపు పక్కటెముకలకు గాయాలయ్యాయి. ఈ మేరకు అమితాబ్ బచ్చన్, తన బ్లాగులో రాసుకొచ్చారు. ప్రస్తుతం ముంబైలో తన నివసంలో ఉన్నట్లు, విశ్రాంతి తీసుకుంటున్నట్లు వెల్ల్డి చేసారు. ప్రమాదం జరిగిన వెంటనే హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి బయలుదేరినట్లు, అక్కడ సీటీ స్కాన్ జరిపినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ముంబైకి చేరుకున్నట్లు సమాచారం. గాయం మానడానికి కొన్ని వారాల సమయం పట్టవచ్చని, అప్పటి దాకా విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారని, ప్రస్తుతానికి షూటింగ్ క్యాన్సిల్ అయ్యిందని తన బ్లాగులో రాసుకొచ్చారు అమితాబ్.
జల్సా గేటు వద్దకు అభిమానులను రావొద్దంటూ అమితాబ్ పిలుపు
ముంబైలో తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న అమితాబ్, జల్సా గేట్ వద్దకు రావొద్దని తన అభిమానులకు తెలియజేసాడు. ప్రతీ వారం జల్సా గేటు వద్ద తన అభిమానులను పలకరిస్తూ కనిపిస్తాడు అమితాబ్. అమితాబ్ ను కలుసుకోవడానికి చాలామంది జనం అక్కడ గుమిగూడతారు. అయితే ఈ సారి అక్కడికి రావొద్దని, కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకుంటానని అమితాబ్ అన్నారు. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమాలో ప్రభాస్ హీరోగా కనిపిస్తే, బాలీవుడ్ భామ దీపికా పదుకునే హీరోయిన్ గా కనిపిస్తోంది. ఈ సినిమాలో ఆధునిక విష్ణువు అవతారంలో ప్రభాస్ కనిపిస్తారని చిత్ర నిర్మాత అశ్వనీదత్ చెప్పుకొచ్చారు. 2024 జనవరి 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.