రాణి బేగంలా మారిపోయిన అనసూయ..అవధ్ క్వీన్ బేగం హజ్రత్ మహల్ లుక్ అదుర్స్
స్వాతంత్ర తొలి సమరయోధురాలు రాణి బేగంను యాంకర్, నటీమణి అనసూయ మరిపిస్తోంది.ఈ మేరకు అవధ్ రాణి బేగం హజ్రత్ మహల్ లుక్ లో అదరగొట్టింది. ఈ క్రమంలోనే ఓ అరుదైన ఫోటోను షేర్ చేస్తూ తన ఫోటోను కూడా జత చేస్తూ ట్వీట్ చేసింది. ఈస్ట్ ఇండియా కంపెనీపై తొలి స్వతంత్ర సంగ్రామంలో పోరాడిన అవధ్ రాణి బేగం హజ్రత్ మహల్ వీరవనితగా చరిత్రకెక్కారు.ఆగస్ట్ 15 సందర్భంగా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అవధ్ రాణిని అనసూయ గుర్తు చేశారు. బేగం హజ్రత్ మహల్ ను తలపించేలా వేషధారణలో అనసూయ కనిపించారు. రాణి చిత్రంతో పాటు ఆమె ఆహార్యాన్ని అనుసరించిన అనసూయను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.