Tollywood: టాలీవుడ్లోకి మరో కొత్త ప్రొడక్షన్ హౌస్.. గ్రాండ్గా తొలి చిత్రం లాంచ్
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్లోకి మరో కొత్త ప్రొడక్షన్ హౌస్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. విక్రాంత్ ఫిల్మ్ క్రియేషన్స్ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభ పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ బ్యానర్ ద్వారా శివకృష్ణ మందలపు నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
పూజా కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత సాహు గారపాటి, 'అడ్డా' సినిమా దర్శకుడు కార్తీక్ రెడ్డి, నిర్మాత రాందాస్ ముత్యాల, వ్యాపారవేత్త నర్సింహ రెడ్డి, మందలపు ప్రవళిక, స్వప్న చౌదరి అమ్మినేని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Details
త్వరలో భారీ సినిమాను నిర్మిస్తాం
ఈ సందర్భంగా శివకృష్ణ మందలపు మాట్లాడుతూ మా విక్రాంత్ ఫిల్మ్ క్రియేషన్స్ బ్యానర్పై త్వరలో ఒక భారీ సినిమా ప్రారంభం కానుందని, భవిష్యత్తులో ఎన్నో మంచి చిత్రాలను నిర్మించాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సినిమా టీమ్తో పాటు ఇతర సినీ ప్రముఖులు పాల్గొని వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చారు.
వేద పండితుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది.