
Anupama Parameswaran: అనుపమ 'జానకీ vs స్టేట్ ఆఫ్ కేరళ'కు సెన్సార్ షాక్.. అనుమతి నిరాకరణ!
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర మంత్రి, నటుడు సురేశ్ గోపి, నటి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ'. జానకిగా అనుపమ నటించిన ఈ న్యాయ పోరాట కథని ప్రవీణ్ నారాయణ్ తెరకెక్కించారు. అయితే సెన్సార్ బోర్డు ఈ సినిమాకు అనుమతి నిరాకరించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సీతాదేవి పేరుపై అభ్యంతరం సీతాదేవికి మరొక పేరు అయిన 'జానకిని' అలాంటి పాత్రకు పెట్టకూడదని సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిని బట్టి సినిమా ప్రదర్శనకు అనుమతి ఇవ్వకపోవడాన్ని దర్శకుడు కూడా ధృవీకరించారు.
Details
పేరు మార్చాలనే సూచన
ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ ప్రధాన కార్యదర్శి, దర్శకుడు ఉన్ని కృష్ణన్ మీడియాతో మాట్లాడుతూ సినిమాలో జానకి అనే పేరు ఉపయోగించరాదని సెన్సార్ బోర్డు స్పష్టంగా చెప్పింది. టైటిల్, పాత్ర పేరును మార్చాలని సూచించింది. సీతాదేవి పేరును ఒక దాడికి గురైన మహిళా పాత్రకే పెట్టకూడదని బోర్డు తెలిపిందని చెప్పారు. గతంలోనూ ఇలాంటి ఉదంతం తాజాగా మరో మలయాళ చిత్రం ఇదే సమస్యను ఎదుర్కొంది. అందులోని జానకి పాత్ర పేరును సెన్సార్ అనుమతించకపోవడంతో, నిర్మాతలు 'జయంతి'గా మార్చి సర్టిఫికెట్ పొందారు.
Details
'జానకీ vs స్టేట్ ఆఫ్ కేరళ' - సత్యం గెలుస్తుందనేది కథాంశం
థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా 'సత్యం ఎప్పటికైనా విజయం సాధిస్తుంది' అనే ట్యాగ్లైన్తో వస్తోంది. ఇందులో జానకిగా అనుపమా పరమేశ్వరన్, లాయర్గా సురేశ్ గోపి నటిస్తున్నారు. జూన్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.