NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Arijit Singh: కొత్తతరం సంగీత సంచలనం అర్జిత్‌సింగ్‌.. 15ఏళ్ల సినీ ప్రయాణంలో లెక్కలేనన్ని పురస్కారాలు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Arijit Singh: కొత్తతరం సంగీత సంచలనం అర్జిత్‌సింగ్‌.. 15ఏళ్ల సినీ ప్రయాణంలో లెక్కలేనన్ని పురస్కారాలు
    కొత్తతరం సంగీత సంచలనం అర్జిత్‌సింగ్‌

    Arijit Singh: కొత్తతరం సంగీత సంచలనం అర్జిత్‌సింగ్‌.. 15ఏళ్ల సినీ ప్రయాణంలో లెక్కలేనన్ని పురస్కారాలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 29, 2025
    08:30 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కొత్త తరం సంగీత ప్రపంచానికి సంచలనం అర్జిత్ సింగ్. హిందీ, బెంగాళీ సహా అనేక భాషల్లో వందలాది పాటలు పాడి శ్రోతల మనసులు గెలుచుకున్న ఆ గొప్ప గాయకుడు తన ప్రతిభతో సంగీత ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు.

    ఆయన స్వరకర్తగానూ తన ప్రతిభను చాటుకున్నారు. 15 ఏళ్ల సినీ ప్రయాణంలో ఆయన అనేక పురస్కారాలను అందుకున్నారు.

    భారత ప్రభుత్వం నుంచి రెండు సార్లు జాతీయ చలన చిత్ర పురస్కారాలను అందుకున్నారు. తాజాగా ఆయన ప్రతిభకు గుర్తింపుగా 'పద్మశ్రీ' పురస్కారం అందుకున్నారు.

    వివరాలు 

    ఆషికి 2' చిత్రంలో పాడిన 'తుమ్ హి హో...', తో విశేషమైన గుర్తింపు

    2011లో వచ్చిన 'మర్డర్ 2' చిత్రంలోని మిథున్ స్వరపరిచిన 'ఫిర్ మొహబ్బత్...' పాటతో హిందీ చిత్రసీమలో తన ప్రయాణాన్ని ప్రారంభించిన అర్జిత్, 'ఆషికి 2' చిత్రంలో పాడిన 'తుమ్ హి హో...', 'చాహున్ మై యా నా...' పాటలతో విశేషమైన గుర్తింపును పొందారు.

    ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేదు.

    అర్జిత్ హిందీ, బెంగాళీ, తెలుగు, తమిళం తదితర భాషల్లో అనేక సినిమాలకు పాటలు, అలాగే ప్రైవేట్ ఆల్బమ్ పాటలను పాడి ప్రేక్షకులను మైమరిపించారు.

    తెలుగులో ఆయన పాడిన ముఖ్యమైన పాటల్లో 'మనం' చిత్రంలోని 'కనులను తాకే...', 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' చిత్రంలోని 'మాయ...' పాటలు ఉన్నాయి.

    వివరాలు 

    'ఓం భీమ్ భుష్'లో 'అణువణువు...' పాట

    అంతేకాదు, 'ఉయ్యాలా జంపాలా', 'కేశవ', 'దోచెయ్', 'రౌడీ ఫెలో', 'కేడీ', 'స్వామి రారా' వంటి చిత్రాలకు ఆయన గాత్రం అందించారు.

    ఇటీవల విడుదలైన 'ఓం భీమ్ భుష్'లో 'అణువణువు...' అనే పాటను కూడా ఆయన ఆలపించారు.

    1987లో పశ్చిమ బెంగాల్‌లోని జియాగంజ్‌లో జన్మించిన అర్జిత్ సింగ్, ఓ రియాలిటీ షోలో పాల్గొని చిత్రసీమలోకి అడుగుపెట్టారు.

    ఆయన గాత్రం, ప్రతిభతో సంగీత ప్రపంచాన్ని అలరిస్తూ నేటికీ కొనసాగుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పద్మశ్రీ పురస్కారాలు

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    పద్మశ్రీ పురస్కారాలు

    padma awards 2023: ములాయం, ఎస్ఎం కృష్ణ, మహలనాబిస్‌కు పద్మ విభూషణ్- 106 మందిని వరించిన పద్మ అవార్డులు పద్మవిభూషణ్
    Padma Awards 2024:వెంకయ్యనాయుడు,చిరంజీవికి పద్మవిభూషణ్,మిథున్‌కి పద్మభూషణ్..2024కుగాను పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం పద్మవిభూషణ్
    Revanth reddy: 'పద్మ' అవార్డు గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల నగదు: రేవంత్ రెడ్డి  తెలంగాణ
    Padma Awards 2025: 'పద్మ' అవార్డులకు 139 మంది ఎంపిక.. ప్రకటించిన కేంద్రం పద్మశ్రీ అవార్డు గ్రహీతలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025