
Bhairavam Review: 'భైరవం' రివ్యూ.. ముగ్గురు హీరోలు ఎలా చేశారంటే?
ఈ వార్తాకథనం ఏంటి
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటించిన భారీ మల్టీస్టారర్ సినిమా 'భైరవం' మే 30న థియేటర్లలో విడుదలైంది.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై కెకె రాధామోహన్ నిర్మించగా, విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు.
ఈ చిత్రంలో దివ్య పిళ్ళై, అదితి శంకర్, ఆనంది హీరోయిన్స్గా నటించగా, జయసుధ కీలక పాత్ర పోషించారు.
Details
కథా సారాంశం
వరద (నారా రోహిత్), గజపతి (మంచు మనోజ్) చిన్ననాటి నుంచి స్నేహితులు. గజపతిని ప్రమాదం నుంచి కాపాడిన శీను (బెల్లంకొండ శ్రీనివాస్) కూడా వీరిద్దరితో మంచి బంధం ఏర్పరుచుకుంటాడు.
గజపతి, జమీందారి వంశానికి చెందినవాడు అయినా సంపదను పందాలపై పోగొడతాడు.
శీను వీళ్ల నమ్మిన మిత్రుడిగా ఉంటాడు. వారిద్దరూ తమ ఊరి ఆలయం, దానికి చెందిన ఆస్తిని పరిరక్షించేవారు.
ఇందులో మలుపు వస్తుంది ఒక మినిస్టర్ ఆలయ భూమిపై కన్నేసినప్పుడే. ఆ భూమికి సంబంధించిన పట్టా లాకర్లో ఉండగా, డబ్బుల అవసరంతో ఉన్న గజపతి, ఆ పట్టా మినిస్టర్కు అప్పజెప్పాలని ప్రయత్నిస్తాడు. భార్య (ఆనంది) కోరికలతో పాటు డబ్బు, ప్రతిష్ట కోసం అతడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు?
Details
విశ్లేషణ
ఈ విషయం వరదకి తెలిసినప్పుడు ఏం జరుగుతుంది? శీను ఏ వైపున నిలుస్తాడు? అన్నదే కథ ప్రధానాంశం.
ఈ సినిమా తమిళ హిట్ మూవీ 'గరుడన్' రీమేక్ అయినా, కథను తెలుగుకి అనుగుణంగా మలిచారు.
బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ఈ సినిమాలో కనిపించడంతో అంచనాలు పెరిగాయి. కథ మొత్తం స్నేహం చుట్టూ తిరిగేలా ఉండటమే ప్రత్యేకత.
ఫస్ట్ హాఫ్లో హీరోలకి మంచి ఎలివేషన్లు ఇచ్చారు.
ఇంటర్వెల్ యాక్షన్ సీన్ బాగా హైలైట్ అయ్యింది. సెకండ్ హాఫ్లో గజపతి, వరద మధ్య వచ్చే మలుపులు, శీను పాత్ర పాత్ర పోషణ ప్రేక్షకుల్ని ఆసక్తిగా ఉంచుతుంది.
ముఖ్యంగా 'ఆడదాని కోసమే రాజ్యాలు పోయాయి' అనే సామెతకు తగినదిగా కథని మలిచారు
Details
నటుల ప్రదర్శన
మంచు మనోజ్ 8 ఏళ్ల విరామం తర్వాత నటించిన ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో శక్తివంతంగా నటించాడు.
భవిష్యత్తులో విలన్గా స్థిరపడే అవకాశాలను చూపించాడు. నారా రోహిత్ పుష్కలంగా నటిస్తూ పాత్రకు న్యాయం చేశాడు.
బెల్లంకొండ శ్రీనివాస్ అమాయకత్వం, యాక్షన్ రెండింటిని సమతుల్యంగా ప్రదర్శించాడు. పూనకం సన్నివేశాల్లో మెప్పించాడు.
ఆనంది తన పాత్రలో నెగిటివ్ అంచులు చూపించి ఆకట్టుకుంది. దివ్య పిళ్ళై ఎమోషనల్గా మెప్పించగా, అదితి శంకర్ తెలుగులోకి ఈ సినిమా ద్వారానే ఎంట్రీ ఇచ్చింది.
జయసుధ, ఇనాయ సుల్తానా, సంపత్, టెంపర్ వంశీ వంటి నటులు తగిన స్థాయిలో నటించారు. వెన్నెల కిషోర్ హాస్య రసం అందించాలనుకున్నా, అంతగా ఫలితమివ్వలేదు.
Details
సాంకేతికంగా
సినిమాటోగ్రఫీ గ్రాండ్ గా, విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. యాక్షన్ సీన్లు గూస్ బంప్స్ ఇచ్చేలా డిజైన్ చేశారు. శ్రీచరణ్ పాకాల BGMతో అద్భుతంగా పని చేశాడు.
కొన్ని చోట్ల మ్యూజిక్ ఓవర్గా అనిపించినా, యాక్షన్ సీన్లలో మాధుర్యం ఉంది. విజయ్ కనకమేడల కమర్షియల్ టచ్తో కథను తెలుగు ప్రేక్షకుల రుచికి అనుగుణంగా మలచాడు.
భైరవం స్నేహితుల మధ్య డబ్బు కారణంగా వచ్చే విభేదాలను, సంబంధాల రుజువును కమర్షియల్ ఎమోషనల్ కోణంలో చూపించిన సినిమా. యాక్షన్, ఎమోషన్ ప్రేమికులకు ఇది మంచి ట్రీట్ అవుతుంది.