Page Loader
Chiranjeevi: వరద బాధితుల కోసం చిరంజీవి భారీ విరాళం.. రిప్లై ఇచ్చిన పవన్ కళ్యాణ్
వరద బాధితుల కోసం చిరంజీవి భారీ విరాళం.. రిప్లై ఇచ్చిన పవన్ కళ్యాణ్

Chiranjeevi: వరద బాధితుల కోసం చిరంజీవి భారీ విరాళం.. రిప్లై ఇచ్చిన పవన్ కళ్యాణ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 04, 2024
11:53 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు రాష్ట్రాల్లో వరదలు కారణంగా ఆపార నష్టం కలిగింది. చాలామంది నిరాశ్రయులు అయ్యారు. వరదల వల్ల పలువురు మరణించారు. ఇక తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, విశ్వక్‌సేన్ వంటి హీరోలు విరాళాలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తన పెద్ద మనసును చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కలిపి రూ. కోటి విరాళం ప్రకటించారు.

Details

అన్నయ్య పెద్ద మనస్సు చాటుకున్నందుకు ధన్యవాదాలు

ఈ విషయం గురించి చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో వరదల వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు తన చాలా బాధ కలిగించాయన్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ముఖ్యమంత్రుల నాయకత్వంలో ఈ పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాయని చెప్పారు. ఈ సాయంలో భాగంగా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధులకు చెరో రూ. 50 లక్షలు విరాళంగా అందిస్తున్నానని చెప్పారు. అన్నయ్య చిరంజీవి చేసిన సాయంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆపద సమయంలో అన్నయ్య లాగా ఆదుకుని, మీ పెద్ద మనసును చాటుకున్నందుకు ధన్యవాదాలు అన్నయ్య అని కృతజ్ఞతలు తెలిపారు.