NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Operation Sindoor: పాకిస్థానీ నటీనటులపై బ్యాన్‌.. ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ పిలుపు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Operation Sindoor: పాకిస్థానీ నటీనటులపై బ్యాన్‌.. ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ పిలుపు
    పాకిస్థానీ నటీనటులపై బ్యాన్‌.. ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ పిలుపు

    Operation Sindoor: పాకిస్థానీ నటీనటులపై బ్యాన్‌.. ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ పిలుపు

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 08, 2025
    01:14 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్ చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌'పై పాకిస్థానీ నటీనటులు ఫవాద్‌ ఖాన్‌, మహిరా ఖాన్‌ చేసిన వ్యాఖ్యలను ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ (AICWA) తీవ్రంగా ఖండించింది.

    వీరిని తక్షణమే చిత్ర పరిశ్రమ నుండి బహిష్కరించాలని ఆ సంఘం పిలుపునిచ్చింది.

    కళల పేరుతో ఇలాంటి వ్యక్తులకు గుడ్డిగా మద్దతు ఇవ్వవద్దని అసోసియేషన్‌ చిత్ర పరిశ్రమను కోరింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

    వివరాలు 

    పాకిస్తానీ కళాకారులకు గుడ్డిగా మద్దతు ఇవ్వడం అంటే.. 

    ''వారి వ్యాఖ్యలు మన దేశాన్ని అవమానపరచడమే కాకుండా,ఉగ్రవాదం వల్ల ప్రాణాలు కోల్పోయిన అమాయకులను,దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులను కూడా అవమానించేలా ఉన్నాయి. మన చిత్ర పరిశ్రమలో పని చేస్తున్న పాకిస్థానీ కళాకారులు,చిత్రనిర్మాతలపై పూర్తి బ్యాన్‌ విధించాలి. భారతీయులు వీరిని అభిమానించవద్దు. కళ పేరుతో ఇలాంటి కళాకారులకు గుడ్డిగా మద్దతు ఇవ్వడం జాతీయ గౌరవాన్ని అవమానపరచడమేనని చిత్ర పరిశ్రమ అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, మన దేశం కోసం ఐక్యంగా నిలబడుదాం'' అని వారు అన్నారు.

    అదేవిధంగా, భారతీయ గాయనీగాయకులు పాక్‌ సింగర్స్‌తో వేదికలు పంచుకోవద్దని కూడా సూచించారు. జాతీయ ప్రయోజనాలను ప్రాధాన్యంగా చూడాలని వారు కోరారు.

    వివరాలు 

    9 ఉగ్ర స్థావరాలు ధ్వంసం..  80 మంది ఉగ్రవాదులు మృతి 

    గత నెల ఏప్రిల్‌లో పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ను చేపట్టింది.

    మంగళవారం రాత్రి, అందరూ నిద్రపోతున్న సమయంలో, క్షిపణులు, డ్రోన్లతో పాకిస్థాన్‌తోపాటు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌పై ఆపరేషన్‌ సిందూర్‌ ప్రారంభమైంది.

    ఈ దాడిలో 9 ఉగ్ర స్థావరాలు ధ్వంసం చేసి, 80 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు ప్రకటించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆపరేషన్‌ సిందూర్‌

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    ఆపరేషన్‌ సిందూర్‌

    Operation Sindoor: ఆత్మాహుతి డ్రోన్లు, స్కాల్ప్ క్షిపణులతో విరుచుకుపడ్డ భారత్ భారతదేశం
    Operation Sindoor: పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై 'ఆపరేషర్‌ సిందూర్‌'.. దేశవ్యాప్తంగా అప్రమత్తమైన భద్రతా బలగాలు, పోలీసులు  భారతదేశం
    Vyomika Singh and Sophia Qureshi:ఆపరేషన్ సింధూర్..ఎవరి..సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్ ? భారతదేశం
    Operation Sindoor: పాక్‌లో ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడి.. మాజీ, ప్రస్తుత క్రికెటర్ల స్పందనలివే!  క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025