
RajaSaab : 'రాజాసాబ్' సినిమా టీజర్ లీక్.. ఫిర్యాదు
ఈ వార్తాకథనం ఏంటి
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమా 'రాజాసాబ్'.
ఈ చిత్రంపై అభిమానుల్లోనే కాక, సినిమా వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రభాస్ కెరీర్లో తొలిసారి హారర్, రొమాంటిక్, కామెడీ అంశాలతో కలగలిసిన చిత్రం చేస్తున్నాడు.
ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.
ఈ నెల 16న చిత్ర టీజర్ను అధికారికంగా విడుదల చేశారు మేకర్స్.
టీజర్ రిలీజ్ అయిన 24 గంటల వ్యవధిలోనే 59 మిలియన్ వ్యూస్ సాధించి సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారింది.
అయితే, ఈ టీజర్ను మేకర్స్ విడుదల చేయడానికి మూడు రోజుల ముందే సోషల్ మీడియాలో లీక్ అయింది.
వివరాలు
లీకువీరులపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
ఈ ఘటనపై నిర్మాతలు తీవ్రంగా స్పందించారు. కోట్ల రూపాయలు వెచ్చించి తయారు చేస్తున్న సినిమా ఫుటేజ్ ముందే బయటకు రావడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
టీజర్ లీక్ చేసిన వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది సినిమా యూనిట్.
డబ్బింగ్ విభాగంలో ఇంచార్జ్గా ఉన్న వసంత్కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
లీక్ చేసిన వారిని గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అధికారులను కోరారు.
ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, టీజర్ లీక్ వెనుక ఉన్న బాధ్యుల వివరాలు తెలుసుకునేందుకు విచారణ ప్రారంభించారు.