Ranveer singh: ధురంధర్ సక్సెస్ ఎఫెక్ట్.. ఆర్ఎస్ఎస్ చీఫ్ను కలిసిన రణవీర్ సింగ్
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన ''ధురంధర్2'' భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతోంది. గతంలో ఉన్న అనేక రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ధురంధర్ సక్సెస్తో ఉత్సాహంలో ఉన్న రణవీర్ సింగ్, ఆర్ఎస్ఎస్ (RSS) అధిపతి మోహన్ భగవత్ను కలిసేందుకు శుక్రవారం మహారాష్ట్రలోని నాగ్పూర్కు వెళ్లారు. నివేదికల ప్రకారం, రణవీర్ సింగ్ శుక్రవారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో నాగ్పూర్లో దిగారు. అక్కడి నుంచి నేరుగా ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు.
వివరాలు
ఎం.ఎస్. గోల్వాల్కర్లకు నివాళులు
అక్కడ ఆయన దాదాపు గంటన్నర సమయం గడిపినట్లు సమాచారం. ఈ సమావేశంలో మోహన్ భగవత్తో తన తాజా సినిమా ''ధురంధర్'' విశేషాలను పంచుకున్నారని తెలుస్తోంది. అలాగే ఆర్ఎస్ఎస్ సేవా కార్యక్రమాలు, క్షేత్రస్థాయి కార్యక్రమాల గురించి కూడా తెలుసుకున్నారు. అనంతరం ఆయన రేషింబాగ్లోని డాక్టర్ హెడ్గేవార్ స్మృతి మందిరాన్ని సందర్శించారు. అక్కడ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ కె.బి. హెడ్గేవార్తో పాటు సర్సంఘచాలక్ ఎం.ఎస్. గోల్వాల్కర్లకు నివాళులర్పించినట్లు సమాచారం.