Dil Raju: OTT ప్లాట్ఫారమ్ ప్రారంభంపై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్
ప్రముఖ నిర్మాత దిల్ రాజు త్వరలో OTT ప్లాట్ఫారమ్ను ప్రారంభిస్తున్నట్లు నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తన ఓటీటీ ప్లాట్ఫారమ్ కోసం దిల్రాజు దాదాపు 25 చిత్రాలు, వెబ్ సిరీస్లను నిర్మించే పనిలో నిమగ్నమైనట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అయితే ఓటీటీ ప్లాట్ఫారమ్ ప్రారంభంపై దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ క్లారిటీ ఇచ్చింది. అవన్నీ పుకార్లేనని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తేల్చి చెప్పింది. ఈ మేరకు ట్వీట్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. తమ నిర్మాత దిల్ రాజు గారు ఎలాంటి ఓటీటీ ప్లాట్ఫారమ్ను ప్రారంభించడం లేదని, పుకార్లపై తాము అసంతృప్తితో ఉన్నామని స్పష్టం చేసింది.