S. S. Rajamouli: ఫ్లాప్ ఫేస్ చేయని ఒకే ఒక్క ఇండియన్ డైరెక్టర్.. ఈ డైరెక్టర్ గురించి 10 ఇంట్రెస్టింగ్ విషయాలు...
ఈ వార్తాకథనం ఏంటి
ఎస్.ఎస్. రాజమౌళి ఏ సినిమా తీసినా 10కి 10 మార్కులు పడాల్సిందే. యాదృచ్ఛికంగా ఆయన పుట్టినరోజు కూడా 10/10కి సంబంధించింది.
10వ నెల, 10వ తేదీకి వచ్చిన ఆయన, ఇప్పటిదాకా 10కి పైగా సినిమాలు తీసి ఫ్లాప్ ఫేస్ చేయని ఏకైక భారతీయ డైరెక్టర్గా నిలిచాడు.
'బాహుబలి' డైరెక్టర్ గురించి చాలా మందికి తెలియని 10 ఆసక్తికరమైన విషయాలు:
వివరాలు
హీరో ప్రభాస్తో సమానంగా రెమ్యూనరేషన్
రాజమౌళి పూర్తి పేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. ఆయన తండ్రి కే. విజయేంద్ర ప్రసాద్. అయితే, రాజమౌళి తండ్రి ఇంటిపేరు కోడూరి కాకుండా ఎస్.ఎస్. అని పెట్టుకున్నాడు. దీనికి కారణం అన్న ఎం.ఎం. కీరవాణి. కీరవాణి ఎం.ఎం. అని పెట్టుకోవడం, రాజమౌళి కూడా శ్రీశైల. శ్రీ. రాజమౌళి పేరుని షార్ట్గా ఎస్.ఎస్. రాజమౌళిగా పెట్టుకున్నాడు.
కర్ణాటకలోని రాయిచూర్లో పుట్టిన ఎస్.ఎస్. రాజమౌళి, ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ ఫిల్మ్ మేకర్. 'బాహుబలి' సినిమాకు రాజమౌళి దాదాపు రూ.150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడని టాక్ ఉంది. టాలీవుడ్ను పాన్ ఇండియా మార్కెట్కి పరిచయం చేసిన రాజమౌళి, హీరో ప్రభాస్తో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకున్నాడు.
వివరాలు
రమాని 2001లో పెళ్లి చేసుకున్న రాజమౌళి
రాజమౌళికి జక్కన్న అనే నిక్ నేమ్ పెట్టింది హీరో జూనియర్ ఎన్టీఆర్. ప్రతీ సన్నివేశాన్ని శిల్పి చెక్కినట్టుగా చెక్కుతాడనే ఉద్దేశంతో రాజమౌళిని జక్కన్న అని పిలుస్తాడు తారక్. అది కాస్త రాజమౌళికి నిక్ నేమ్గా మారిపోయింది.
కొవ్వూరులో స్కూల్ చదువు పూర్తి చేసిన ఎస్.ఎస్. రాజమౌళి, ఏలూరులో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పూర్తి చేశాడు. అయితే రెండో సంవత్సరం పూర్తి చేయడానికి రెండు సంవత్సరాలు పట్టింది. దీంతో చదువుకి ఫుల్ స్టాప్ పెట్టి, తండ్రితో కలిసి సినిమాల్లో పనిచేయాలని ఆసక్తి పెంచుకున్నాడు.
కీరవాణి మరదలు అయిన రమాని రాజమౌళి,2001లో పెళ్లి చేసుకున్నాడు.అయితే రమాకి అప్పటికే పెళ్లి జరిగి,కొడుకు కూడా ఉన్నాడు.భర్తతో విడిపోయిన ఆమెని పెళ్లాడిన రాజమౌళి, కొడుకు కార్తికేయను సొంత కొడుకులా చూసుకుంటున్నాడు.
వివరాలు
రాజమౌళి, జగపతిబాబు వియ్యంకులు
రాజమౌళి, రమా దంపతులకు మయూఖ అనే కూతురు కూడా ఉంది. ఈ అమ్మాయిని దత్తత చేసుకున్నారు. కార్తికేయ, జగపతి బాబు కూతురు పూజా ప్రసాద్ని పెళ్లి చేసుకున్నాడు. అంటే రాజమౌళి, జగపతిబాబు వియ్యంకులు అవుతారు.
రాజమౌళి తాత 360 ఎకరాల భూసామి. అయితే,రాజమౌళికి 10-11 ఏళ్ల వయసులో ఆ ఆస్తి అంతా కరిగిపోయింది. మిగిలిన ఆస్తులను అమ్మి, చెన్నైకి మకాం మార్చిన విజయేంద్ర ప్రసాద్, బాబాయి శివ శక్తి దత్తా సినిమాను నిర్మించడానికి అడుగుపెట్టారు. అయితే, వాళ్లు మొదలెట్టిన సినిమాలు పూర్తి కాకుండా ఆగిపోవడంతో ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. ఇంటి అద్దె కట్టలేని స్థితిలో విజయేంద్ర ప్రసాద్, శివ శక్తి దత్తా కుటుంబాలు రెండు రూముల్లో నివాసం ఉండేవాళ్లు.
వివరాలు
డైరెక్టర్ క్రాంతి కుమార్ దగ్గర అసిస్టెంట్
13 మంది కలిసి రెండు గదుల్లో ఉన్న ఆనాటి పరిస్థితులను తలుచుకుని రాజమౌళి నవ్వుకుంటూ ఉంటాడు. 1994లో 'బొబ్బిలి సింహం', 'ఘరానా మొగుడు' వంటి సూపర్ హిట్ చిత్రాలకు కథలు అందించిన విజయేంద్ర ప్రసాద్ మళ్లీ ఆర్థికంగా నిలదొక్కుకున్నారు.
ఫిల్మ్ ఎడిటింగ్, రైటింగ్ విభాగాల్లో పని చేసిన తర్వాత, డైరెక్టర్ క్రాంతి కుమార్ దగ్గర అసిస్టెంట్గా పని చేశాడు రాజమౌళి. డైరెక్టర్గా మారకముందు తెలుగుదేశం పార్టీకి కొన్ని యాడ్స్ కూడా డైరెక్ట్ చేశాడు జక్కన్న. ఆ తర్వాత 'శాంతి నివాసం' సీరియల్తో దర్శకుడిగా మారాడు.
వివరాలు
మొదటి సినిమాకే ఇలాంటి హీరో దొరకాడేంటి..
ఎన్టీఆర్తో 'స్టూడెంట్ నెం.1' మూవీ తీసిన రాజమౌళి, ఆ సినిమా సమయంలో క్రేన్ ఎలా వాడాలో కూడా తెలిసేది కాదని చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ని మొదటిసారి చూసినప్పుడు, మొదటి సినిమాకే ఇలాంటి హీరో దొరకాడేంటని అనుకున్న రాజమౌళి. అతని డెడికేషన్, టాలెంట్ చూసి ఫ్యాన్ అయిపోయాడు. అందుకే ఎన్టీఆర్తో 'సింహాద్రి', 'యమదొంగ', 'RRR' సినిమాలు చేశాడు.
వివరాలు
మోహన్లాల్తో ఓ పౌరాణిక సినిమా చేసేందుకు ప్లాన్
'సింహాద్రి' తర్వాత మలయాళ స్టార్ నటుడు మోహన్లాల్తో ఓ పౌరాణిక సినిమా చేసేందుకు ప్లాన్ చేశాడు రాజమౌళి.
ఈ సినిమా కోసం చాలా స్కెచ్లు కూడా గీయించాడు. అయితే,ఈ సినిమా ఆరంభానికి ముందే ఆగిపోయింది.
అలాగే కె. రాఘవేంద్రరావు కొడుకు ప్రకాశ్ కోవెలపూడితో ఓ భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ మూవీ కూడా ప్లాన్ చేశాడు రాజమౌళి.
అయితే అప్పట్లోనే ఈ సినిమాకి రూ.20 కోట్లకు పైగా బడ్జెట్ అవుతుందని అంచనా వేయడం, ప్రకాశ్ మొదటి సినిమా'నీతో'డిజాస్టర్ కావడంతో రాజమౌళి,ప్రకాశ్ మూవీ ఆగిపోయింది.
ఇకపోతే, "పిల్లన గ్రోవి" అనే సినిమాలో రాజమౌళి బాల నటుడిగా నటించిన విషయం,అలాగే అర్థాంగికి అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసిన విషయాలు చాలా తక్కువ మందికి తెలిసి ఉంటాయి.