
Teja Sajja: హనుమాన్ నుంచి మిరాయ్ వరకు.. పాన్ఇండియా హీరోల సరసన చేరిన తేజ సజ్జా
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ యంగ్ హీరో 'తేజ సజ్జా' పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రీసౌండ్ వచ్చేలా దూసుకుపోతున్నాడు. హనుమాన్ విజయాన్ని కొనసాగిస్తూ, తాజాగా విడుదలైన మిరాయ్ మూవీతో మరోసారి బ్లాక్బస్టర్ హిట్ సాధించాడు. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో విజువల్ వండర్గా తెరకెక్కిన ఈ సినిమా, సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్గా గ్రాండ్ రిలీజ్ అయింది. మొదటి రోజే సాలిడ్ ఓపెనింగ్స్ సాధించిన మిరాయ్, ప్రపంచవ్యాప్తంగా 27.20 కోట్ల గ్రాస్ వసూలు చేసి, హనుమాన్ తర్వాత తేజ సజ్జాకు భారీ ఓపెనింగ్ అందించిన సినిమాగా నిలిచింది. రెండో రోజు కలెక్షన్లు మరింతగా పెరిగి, రెండు రోజుల్లోనే 55.66 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
Details
ఫస్ట్ వీకెండ్ లో రూ.81.2కోట్లు
ఇక మూడో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లు సాధించి, ఫస్ట్ వీకెండ్లో మొత్తం రూ. 81.2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి, భారీ లాభాల దిశగా దూసుకుపోతోంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా మిరాయ్ దూసుకెళ్తోంది. ఓవర్సీస్లో 2 మిలియన్ డాలర్ల మార్క్కు చేరువలో ఉంది. ముఖ్యంగా హిందీ బాక్సాఫీస్ వద్ద తేజ సజ్జా ఓ సంచలనం సృష్టిస్తున్నాడు. ఇప్పటి వరకు హిందీ మార్కెట్లో ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ మాత్రమే పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటగా, ఇప్పుడు తేజ సజ్జా కూడా వారి సరసన చేరాడు. హనుమాన్ సినిమాతో నార్త్ బెల్ట్లో మంచి ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న తేజ, మిరాయ్తో ఆ మార్కెట్ను రెట్టింపు చేసుకున్నాడు.
Details
మూడ్రోజుల్లో రూ.10 కోట్లు వసూళ్లు
దానికి నిదర్శనమే మిరాయ్ హిందీ కలెక్షన్లు. మూడు రోజుల్లోనే రూ. 10 కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో, తెలుగు హీరోలలో ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ తర్వాత ఈ స్థాయి విజయాన్ని సాధించిన ఏకైక హీరోగా తేజ సజ్జా రికార్డ్ సృష్టించాడు. ఈ ఘనత అతని కెరీర్లో ఒక మైలురాయిగా నిలవడమే కాకుండా, పాన్ ఇండియా లెవల్లో నెక్స్ట్ బిగ్ థింగ్ అనే సామర్థ్యాన్ని చూపిస్తోంది. మొత్తంగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో, తేజ సజ్జా పాన్ ఇండియా రేంజ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు.