Ram Pothineni: హీరో నుంచి కథారచయితగా రామ్.. టాలీవుడ్లో కొత్త ఛాప్టర్!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని వెండితెరపై విజయవంతంగా రెండు దశాబ్దాల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. 'దేవదాసు'తో ప్రారంభమైన ఆయన ప్రయాణంలో లవర్ బాయ్గా, మాస్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించారు. కాలక్రమేణా తనలోని విభిన్న కోణాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ముందుకు సాగుతున్న రామ్, ఇటీవల తన ప్రతిభను మరింత విస్తరించుకుంటున్నారు. గతేడాది విడుదలైన 'ఆంధ్ర కింగ్ తాలూకా' చిత్రంతో థియేటర్లలో సందడి చేసిన ఆయన, ఆ సినిమాలో తొలిసారి గీత రచయితగా మారి పాట రాయడమే కాకుండా స్వయంగా ఆలపించి అభిమానులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం రామ్ మరో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారు.
వివరాలు
అంచనాలు మరింత పెరిగే అవకాశం
ఈసారి కథా రచయితగా మారి తన ప్రతిభను చాటుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక వైవిధ్యమైన కథను సిద్ధం చేసుకున్న ఆయన ఆ కథను తెరపైకి తీసుకురావడానికి సరైన దర్శకుడి కోసం అన్వేషణ ప్రారంభించారు. ఒక హీరో స్వయంగా కథను రాయడం సినిమాపై అంచనాలను మరింత పెంచే అంశంగా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, లోకేశ్ కనగరాజ్ శిష్యుడు లోగి విఘ్నేశ్తో రామ్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ కొత్త కథను లోగి విఘ్నేశ్ దర్శకత్వంలోనే తెరకెక్కిస్తారా? లేక మరో దర్శకుడిని ఎంపిక చేస్తారా? అన్నదానిపై ఆసక్తి నెలకొంది.
వివరాలు
పుట్టిన రోజున స్పష్టత వచ్చే అవకాశం
ఈ విషయంపై వచ్చే నెల మే 15న రామ్ పుట్టినరోజు సందర్భంగా పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. తన 20 ఏళ్ల సినీ అనుభవంతో రామ్ ఎలాంటి కథను సిద్ధం చేశారో తెలుసుకోవడానికి అభిమానులతో పాటు సినీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.