LOADING...
Peddi: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. 'పెద్ది' నుంచి లేటెస్ట్ అప్‌డేట్‌ వచ్చేసింది!
రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. 'పెద్ది' నుంచి లేటెస్ట్ అప్‌డేట్‌ వచ్చేసింది!

Peddi: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. 'పెద్ది' నుంచి లేటెస్ట్ అప్‌డేట్‌ వచ్చేసింది!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 28, 2025
09:20 am

ఈ వార్తాకథనం ఏంటి

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, 'ఉప్పెన' ఫేమ్‌ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో రూపొందుతున్న 'పెద్ది' సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌, సాంగ్‌ ప్రేక్షకుల్లో విపరీతమైన బజ్‌ను క్రియేట్‌ చేయగా, ఇప్పుడు సెకండ్‌ సాంగ్‌కు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్‌ ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ సరసన అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. రాబోయే షెడ్యూల్‌లో వీరిద్దరిపై ఒక భారీ సాంగ్‌ను చిత్రీకరించేందుకు యూనిట్‌ ప్లాన్‌ చేస్తోందని సమాచారం. ఈ పాటలో రామ్‌ చరణ్‌ తనదైన గ్రేస్‌ఫుల్‌ స్టెప్పులతో ప్రేక్షకులను అలరించనున్నాడని, జాన్వీ కపూర్‌ గ్లామర్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలవనుందని టాక్‌ వినిపిస్తోంది.

Details

సంగీతం అందిస్తున్న ఏఆర్ రెహమాన్

ఇక ఈ చిత్రానికి ఆస్కార్‌ విజేత ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తుండటంతో, మ్యూజిక్‌ పరంగా ఈ సాంగ్‌ ఒక సెన్సేషన్‌గా మారుతుందనే అంచనాలు ఫ్యాన్స్‌లో ఉన్నాయి. బుచ్చిబాబు మార్క్‌ విలేజ్‌ డ్రామాకు రెహమాన్‌ క్లాసిక్‌ టచ్‌ కలిస్తే ఫలితం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని సినీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ పాత్ర తన గత చిత్రాలకంటే భిన్నంగా, రా అండ్‌ రస్టిక్‌ షేడ్స్‌తో ఉండబోతుందని సమాచారం. కేవలం కమర్షియల్‌ హంగులకే పరిమితం కాకుండా, కథలో కూడా మంచి లోతు ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది.

Details

వచ్చే ఏడాది రిలీజ్

శివ రాజ్‌కుమార్‌, జగపతి బాబు వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్న నేపథ్యంలో, 'పెద్ది' రేంజ్‌ పాన్‌ ఇండియా స్థాయికి చేరుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా రాజీ పడకుండా భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వెండితెరపై ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్‌ చరణ్‌ డ్యాన్స్‌, జాన్వీ కపూర్‌ అందం, ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం... ఈ మూడు కలిసొస్తే 'పెద్ది' సెకండ్‌ సాంగ్‌ యూట్యూబ్‌లో రికార్డులు తిరగరాయడం ఖాయమన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి.

Advertisement