Pawan Kalyan: 'హరి హరవీరమల్లు' కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించిన నిర్మాణ సంస్థ
ఈ వార్తాకథనం ఏంటి
పవన్ కళ్యాణ్ అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'హరిహర వీరమల్లు' చిత్రం మే 9న విడుదల కానుందని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రానికి క్రిష్-జ్యోతికృష్ణలు దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తుండగా, మొదటి భాగం చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం 'హరి హర వీరమల్లు' కొత్త విడుదల తేదీని ప్రకటించింది.
వివరాలు
కొత్త పోస్టర్ను విడుదల చేసిన చిత్రబృందం
మే 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కొత్త పోస్టర్ను విడుదల చేస్తూ, చిత్రబృందం హోలీ శుభాకాంక్షలు తెలిపింది.
పోస్టర్లో పవన్ కల్యాణ్, నిధి అగర్వాల్ గుర్రపుస్వారీ చేస్తూ కనిపిస్తున్నారు.
17వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ కథలో పవన్ చారిత్రాత్మక యోధుడిగా నటించగా, నిధి అగర్వాల్, బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి కీలక పాత్రలు పోషించారు.
ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎ. దయాకర్ రావు నిర్మిస్తుండగా, ఎ.ఎం. రత్నం సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. సంగీతాన్ని ఎం.ఎం. కీరవాణి అందిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్
The battle is set, and the fight for JUSTICE and DHARMA will be unstoppable! ⚔️🔥#HariHaraVeeraMallu charges into battle at breakneck speed, and NOTHING will alter the hunt this time.
— Hari Hara Veera Mallu (@HHVMFilm) March 14, 2025
A saga of valor is all set to ignite the screens on May 9th, 2025 ❤️🔥💥
A POWER-PACKED… pic.twitter.com/BOE4mmmbXY