LOADING...
AR. Rahman: 'యాంటీ నేషనల్' కామెంట్స్‌పై ఏఆర్ రెహమాన్ రియాక్షన్ ఇదే.. వైరల్ అవుతున్న పోస్ట్!
'యాంటీ నేషనల్' కామెంట్స్‌పై ఏఆర్ రెహమాన్ రియాక్షన్ ఇదే.. వైరల్ అవుతున్న పోస్ట్!

AR. Rahman: 'యాంటీ నేషనల్' కామెంట్స్‌పై ఏఆర్ రెహమాన్ రియాక్షన్ ఇదే.. వైరల్ అవుతున్న పోస్ట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 18, 2026
12:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

దర్శకుడు ఇంతియాజ్ అలీ (Imtiaz Ali) తెరకెక్కించిన విభజన (Partition) నేపథ్యంలో రూపొందిన మేన్ వాపస్ ఆవూంగా (Main Vaapas Aaunga) ప్రస్తుతం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటూ మంచి మౌత్ పబ్లిసిటీతో ముందుకు సాగుతోంది. భావోద్వేగభరిత కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సినిమాపై సోషల్ మీడియాలోనూ విస్తృత చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సినిమాను "యాంటీ నేషనల్"గా అభివర్ణిస్తూ వ్యంగ్యంగా చేసిన ఒక పోస్ట్‌పై సంగీత దర్శకుడు ఏఆర్. రెహమాన్ స్పందించడం ఆసక్తికరంగా మారింది.

వివరాలు

వైరల్ పోస్ట్‌పై రెహమాన్ స్పందన

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ పోస్ట్‌లో పాకిస్థాన్‌ను ఉగ్రవాదులు, గూఢచారులు లేకుండా చూపించడానికి ఈ సినిమా ధైర్యం చేసింది. అందుకే ఇది యాంటీ నేషనల్‌నా?" అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఆ పోస్ట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఏఆర్ రెహమాన్, దానికి నవ్వుతున్న ఎమోజీని జోడించారు. దీంతో ఆయన స్పందన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వ్యంగ్య పోస్ట్‌లో మరో ఆసక్తికర వ్యాఖ్య కూడా ఉంది. "భారతీయ గూఢచారి పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకునే కథను చూడాలని ఆశించిన ఓ వ్యక్తి, సినిమా చివర్లో 'మేన్ వాపస్ ఆవూంగా' అనే డైలాగ్ విన్న తర్వాత కూడా ఇందులో ఉగ్రవాదులు లేదా గూఢచారులు లేకపోవడంతో ఆశ్చర్యపోయాడు.

వివరాలు

1947 విభజన నేపథ్యంలో కథ

అయితే సినిమా భావోద్వేగ కథనానికి కదిలిపోయిన అతను, పాకిస్థాన్‌లో కూడా సాధారణ మనుషులు ఉంటారని కొత్త కోణంలో ఆలోచించే అవకాశం పొందాడు" అని పేర్కొన్నారు. 'మేన్ వాపస్ ఆవూంగా' చిత్రంలో దిల్జిత్ దోసాంజ్, శర్వరి, వేదంగ్ రైనా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో వేదాంగ్ రైనా, నసీరుద్దీన్ షా పాత్రకు యువకుడి వెర్షన్‌గా కనిపించారు. 1947లో బ్రిటిష్ భారతదేశ విభజన నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో, విభజన కారణంగా ప్రజలు ఎదుర్కొన్న విషాదాన్ని ఒక క్లాసిక్ ప్రేమకథతో మేళవించి ఇమ్తియాజ్ అలీ తెరపై ఆవిష్కరించారు.

Advertisement

వివరాలు

దిల్‌జిత్‌తో ఇమ్తియాజ్ అలీకి రెండో సినిమా

2024లో విడుదలైన అమర్ సింగ్ చంకీలా తర్వాత ఇమ్తియాజ్ అలీ, దిల్‌జిత్ దోసాంఝ్ కలిసి పనిచేసిన రెండో చిత్రం ఇదే. అలాగే దర్శకుడు ఇమ్తియాజ్ అలీ, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, గేయ రచయిత ఇర్షాద్ కామిల్ మరోసారి కలిసి పనిచేశారు. ఈ ముగ్గురి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన రాక్‌స్టార్, తమాషా, హైవే, 'అమర్ సింగ్ చంఖీలా' వంటి చిత్రాల సంగీతం విశేష ఆదరణ పొందింది.

Advertisement

వివరాలు

మెల్లగా పుంజుకుంటున్న కలెక్షన్లు

బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ, ప్రేక్షకుల నుంచి వస్తున్న సానుకూల స్పందనతో కలెక్షన్లు క్రమంగా పెరుగుతున్నాయి. తొలి రోజు రూ.1.15 కోట్ల వసూళ్లు సాధించిన ఈ చిత్రం, సోమవారం ఒక్కరోజే రూ.1.25 కోట్లను రాబట్టింది. పాజిటివ్ టాక్‌తో ముందుకు సాగుతున్న ఈ సినిమా త్వరలోనే రూ.10 కోట్ల మార్క్‌ను చేరుకునే దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం ప్రేక్షకుల్లో పెరుగుతున్న ఆసక్తి, సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు సినిమాకు మరింత ఊతమిస్తున్నాయి.

Advertisement