లంగా ఓణీలో హోయలొలికిస్తున్న జాన్వీ పల్లెటూరి అందం.. తంగం కొత్త స్టిల్ రిలీజ్
దేవర చిత్రానికి సంబంధించి మరో అదిరిపోయే స్టిల్ రిలీజైంది. ఈ మేరకు హీరోయిన్ జాన్వీ కపూర్ కొత్త లుక్ విడుదలైంది. తాజాగా ఈ సినిమాలో జాన్వీ కపూర్ లంగా వోణిలో పల్లెటూరి అందంతో హోయలొలికిస్తోంది. అచ్చం పల్లె యువతిగా అదరగొడుతోంది. ఈ క్రమంలో ఇదిగో మా తంగం అంటూ చిత్ర బృందం లేటెస్ట్ ఫోటోను విడుదల చేసింది.ప్రస్తుతం దేవర మూవీ షూటింగ్ గోవాలో జరుగుతోంది. జాన్వీ కపూర్ పై కీలక సన్నివేశాలు ఇప్పటికే తెరకెక్కించారు.సముద్రం నేపథ్యంలో సాగే ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ లో బాలీవుడ్ నటుడు హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఎన్టీఆర్ సినిమా జీవితంలో దేవర 30వది కాగా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.