Page Loader
Death Threats: కపిల్ శర్మ,రాజ్‌పాల్ యాదవ్,మరో ఇద్దరు ప్రముఖుల హత్యకు బెదిరింపులు..కేసు నమోదు
కపిల్ శర్మ,రాజ్‌పాల్ యాదవ్,మరో ఇద్దరు ప్రముఖుల హత్యకు బెదిరింపులు..కేసు నమోదు

Death Threats: కపిల్ శర్మ,రాజ్‌పాల్ యాదవ్,మరో ఇద్దరు ప్రముఖుల హత్యకు బెదిరింపులు..కేసు నమోదు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 23, 2025
10:15 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల సైఫ్‌ అలీఖాన్‌పై దుండగుడు దాడి చేసిన ఘటన ఇంకా మరువకముందే పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలకు హత్య బెదిరింపులు రావడం చర్చనీయాంశమై ఉంది. బాలీవుడ్‌ స్టార్‌ కమెడియన్‌ కపిల్‌ శర్మతో పాటు, రాజ్‌పాల్‌ యాదవ్‌, రెమో డిసౌజా వంటి ప్రముఖులకు కూడా ఈ బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. వీరికి ఈ బెదిరింపులు పంపిన వ్యక్తి పేరు విష్ణు అని చెబుతున్నారు. ఈ మేరకు ఆంగ్ల మీడియాలలో కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ బెదిరింపులు పంపిన ఈ-మెయిల్‌లో, ''మేము మీ ప్రతి కదలికను పర్యవేక్షిస్తున్నాము. ఇది మీకు చేసిన పబ్లిక్‌ స్టంట్‌ కాదు. మీరు ఈ బెదిరింపులను సీరియస్‌గా తీసుకోవాలి. ఇది కేవలం వేధించేందుకు చేసిన ప్రయత్నం కాదు'' అని పేర్కొనబడింది.

వివరాలు 

అంబోలి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు 

ఈ మెయిల్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, నిందితుడు ఎనిమిది గంటల్లో తన డిమాండ్లను నెరవేర్చాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించాడు. అయితే, ఈ మెయిల్ పంపిన వ్యక్తి తన డిమాండ్లను ఇంకా వెల్లడించలేదు. ఈ బెదిరింపులపై రాజ్‌పాల్‌ యాదవ్‌ భార్య ఫిర్యాదు చేసిన తర్వాత, అంబోలి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయ్యింది.