LOADING...
Jayam Ravi : జయం రవితో సంబంధంపై కెనీషా స్పష్టత.. సోషల్ మీడియాకు గుడ్‌బై
జయం రవితో సంబంధంపై కెనీషా స్పష్టత.. సోషల్ మీడియాకు గుడ్‌బై

Jayam Ravi : జయం రవితో సంబంధంపై కెనీషా స్పష్టత.. సోషల్ మీడియాకు గుడ్‌బై

వ్రాసిన వారు Moogati Shabari
May 16, 2026
11:10 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ నటుడు జయం రవి (రవి మోహన్)తో తనకు సంబంధం ఉందన్న వార్తలపై గాయని కెనీషా స్పందించారు. రవితో తన బంధాన్ని ముగిస్తున్నట్లు ఆమె పరోక్షంగా వెల్లడించారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పొడవైన పోస్టు ద్వారా తెలియజేశారు. ఈ ప్రచారాల కారణంగా తాను తీవ్ర భావోద్వేగ ఒత్తిడికి గురయ్యానని పేర్కొంటూ, చెన్నైని విడిచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అంతేకాకుండా, తనకు అత్యంత ప్రీతిపాత్రమైన సంగీతాన్ని కూడా వదులుకుంటున్నానని వెల్లడించారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కూడా తొలగిస్తున్నట్లు ప్రకటించారు.

వివరాలు

చాలా కోల్పోయానన్న కెనీషా..

తన పోస్టులో కెనీషా మాట్లాడుతూ.. ఇప్పటివరకు అవసరానికి మించి మాట్లాడానని, ఎంతో ప్రేమతో ఈ ప్రయాణంలోకి అడుగుపెట్టినా ఇప్పుడు మౌనంగా దూరమవుతున్నానని పేర్కొన్నారు. ఈ ప్రపంచం అహంకారాలు, అసత్య ప్రచారాలతో నిండిపోయిందని, అక్కడ నిజమైన మంచితనానికి స్థానం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితుల్లో ప్రేమ కూడా భారంగా మారుతుందని తెలిపారు. ఒక వ్యక్తిని కాపాడేందుకు ప్రయత్నిస్తూ తాను చాలా కోల్పోయానని, అయితే ఈ ప్రపంచంలో ప్రదర్శనకే ఎక్కువ విలువ ఉంటుందని ఇప్పుడు అర్థమైందని అన్నారు.

వివరాలు

బ్రేకప్ అంటూ ఎమోషనల్ పోస్ట్..

తనపై జరుగుతున్న ట్రోలింగ్‌ గురించి కూడా ఆమె స్పందించారు. సినిమా పరిశ్రమలోని వ్యక్తులు, జయం రవిని అభిమానించే వారు, అతడి జీవితంపై తమకే హక్కు ఉందని భావించే వారందరికీ తాను ఒకటే చెప్పాలనుకుంటున్నానని అన్నారు. ఆమె మాట్లాడుతూ.. "ఇక అతడు పూర్తిగా మీవాడే" అని వ్యాఖ్యానించారు. ఇకపై ఈ విషయంపై ఎలాంటి వివరణలు ఇవ్వబోనని, మరిన్ని పోరాటాలు చేయలేనని స్పష్టం చేశారు. మంచి వ్యక్తులకు తోడుగా నిలవాలని భావించడం తన అమాయకత్వమని, కానీ ఈ ప్రపంచం అబద్ధాలు, మోసాలతో నిండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను అతడిని పూర్తిగా వదులుకుంటున్నానని, ఇప్పటివరకు తీసుకున్న అన్ని బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని తెలిపారు.

Advertisement

వివరాలు

చెన్నై విడిచి వెళ్లిపోతున్నానని వెల్లడి..

ఇక తాను ఓడిపోయానని చెప్పిన కెనీషా, చెన్నైని విడిచి వెళ్లిపోతున్నానని వెల్లడించారు. సంగీతం, థెరపీ, తన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను వదులుకుంటున్నానని తెలిపారు. దేవుడు సృష్టించిన బంధాలను కూడా మనుషులు విరిచివేయగలరని ఇప్పుడు అర్థమైందని అన్నారు. సోషల్ మీడియాలో ఎదురైన వేధింపులు, ట్రోలింగ్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. అందుకే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కూడా తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఫెమినిజం గెలిచిందేమో కానీ, ఆనందం మాత్రం ఓడిపోయిందని ఆమె వ్యాఖ్యానించారు. కాగా రవి మోహన్ తన భార్య ఆర్తితో విడిపోతున్నట్లు 2024లో ప్రకటించారు. ఆ తరువాత నుంచే ఆయనకు గాయని కెనీషాతో సంబంధం ఉందన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement