LOADING...
Mana Shankara Vara Prasad Garu tickets: 'మన శంకర వరప్రసాద్‌ గారు' టికెట్స్‌.. సాధారణ ధరకు లభ్యం..ఎప్పటి నుంచి అంటే? 
ఎప్పటి నుంచి అంటే?

Mana Shankara Vara Prasad Garu tickets: 'మన శంకర వరప్రసాద్‌ గారు' టికెట్స్‌.. సాధారణ ధరకు లభ్యం..ఎప్పటి నుంచి అంటే? 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 22, 2026
01:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

చిరంజీవి కథానాయకుడిగా నటించిన, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'మన శంకరవరప్రసాద్‌గారు' ప్రేక్షకుల ముందుకు సంక్రాంతి కానుకగా వచ్చింది. విడుదల అవ్వగానే ఈ మూవీ బాక్సాఫీస్‌లో ఘన విజయాన్ని సాధించింది. అంతేకాదు, చిరంజీవి కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం‌గా కూడా రికార్డు సృష్టించింది. ఇప్పటివరకూ ఈ సినిమా రూ.300 కోట్లు కంటే ఎక్కువ వసూలు చేసింది.చిరంజీవి అభిమానులు, సినిమా ప్రేక్షకుల కోసం మంచి వార్త ఏమిటంటే,ఇంతకాలం తెలుగు రాష్ట్రాల్లో పెంచిన టికెట్‌ ధరలు అమల్లో ఉండగా,నేటి నుండి సాధారణ ధరకే టికెట్లు లభిస్తాయి. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు టికెట్‌ ధరలు పెంచుకునేందుకు పది రోజుల ప్రత్యేక అనుమతి ఇచ్చాయి.

వివరాలు 

ఓవర్సీస్‌లో కూడా హిట్

ఇప్పుడు ఆ గడువు ముగియడంతో సాధారణ ధరకే టికెట్లు లభించనున్నాయి. ఇప్పటికే బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌తో అలరిస్తున్న మూవీ నేటినుంచి మరింత ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటుందని చిత్ర వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. చిరంజీవి నటన, అనిల్ రావిపూడి దర్శకత్వం, భీమ్స్ సంగీతం, చివరి సన్నివేశంలో వెంకటేశ్ మెరుపులు సినిమాను విజయవంతంగా నడిపాయి. అంతే కాక, ఈ చిత్రం ఓవర్సీస్‌లో కూడా హిట్‌గా నిలిచింది. ఇప్పటివరకూ 4.2 మిలియన్‌ డాలర్లు వసూలు చేసి 5 మిలియన్‌ డాలర్ల క్లబ్‌ వైపు పరుగులు తీస్తోంది.

వివరాలు 

పవన్‌కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ శుభాకాంక్షలు..

పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ కూడా చిరంజీవి బృందానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసింది. "చిరంజీవి గారికి, చిత్ర యూనిట్‌కు మెగా బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు. చిరంజీవి అద్భుతమైన సినీ ప్రయాణంలో మరో విజయవంతమైన సినిమా ఇది. అనిల్ రావిపూడి గారికి ప్రత్యేక అభినందనలు. చిరంజీవి, వెంకటేశ్ ఒకే తెరపై కనిపించడం ప్రేక్షకులకు అపూర్వమైన ఆనందాన్ని అందించింది. భీమ్స్ సంగీతం, సాహు గారపాటి మరియు సుష్మిత నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలకు చేరువయింది" అని పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పేర్కొంది.

Advertisement