RC 17 : రామ్చరణ్-సుకుమార్ మూవీకి ముహూర్తం ఫిక్స్.. సెప్టెంబర్లో గ్రాండ్ లాంచ్!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్లో అత్యంత విజయవంతమైన కాంబినేషన్లలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ జోడీ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. వీరిద్దరి కలయికలో వచ్చిన 'రంగస్థలం' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఇప్పుడు ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన పలు ఆసక్తికరమైన వివరాలు ఫిల్మ్నగర్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఇది పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతుందని, రెండు భాగాలుగా విడుదలవుతుందని పలు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
వివరాలు
స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా మూవీ
అయితే తాజా సమాచారం ప్రకారం ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది.
సమాచారం ప్రకారం ఈ చిత్రం పీరియాడిక్ కథాంశంతో కాకుండా పూర్తి స్థాయి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనుంది.
అలాగే రెండు భాగాలుగా కాకుండా ఒకే భాగంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
మెగా అభిమానులు రామ్చరణ్ నుంచి ఆశించే హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్లు ఈ చిత్రంలో మరింత గ్రాండ్గా ఉండనున్నాయని టాక్.
సుకుమార్ చిత్రాలకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచే మైండ్-బెండింగ్ స్క్రీన్ప్లే ఈ సినిమాలో కూడా కీలక ఆకర్షణ కానుందని సమాచారం.
వివరాలు
భారీ ప్రణాళికతో ముందుకెళ్తున్న మేకర్స్
ఇక రామ్చరణ్ పాత్ర విషయానికి వస్తే.. 'రంగస్థలం'లోని చిట్టిబాబు పాత్రను, ప్రస్తుతం తెరకెక్కుతున్న 'పెద్ది' చిత్రంలోని పవర్ఫుల్ పాత్రను మించే స్థాయిలో నటనకు అవకాశం ఉన్న పాత్రను సుకుమార్ డిజైన్ చేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
సంగీతం విషయంలో కూడా మేకర్స్ భారీ ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రానికి బాలీవుడ్కు చెందిన ఓ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం అందించే అవకాశం ఉందని సమాచారం.
ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్లో ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్
అనంతరం నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.
విడుదల విషయంలో కూడా మేకర్స్ భారీ ప్లాన్ రూపొందించినట్లు తెలుస్తోంది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ను 2027 చివర్లో లేదా 2028 మార్చిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో సన్నాహాలు చేస్తున్నట్లు ఫిల్మ్నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.