NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / SIIMA 2024: సైమా 2024 అవార్డుల వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా ఆరాధ్య బచ్చన్‌,నయనతార జంట
    తదుపరి వార్తా కథనం
    SIIMA 2024: సైమా 2024 అవార్డుల వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా ఆరాధ్య బచ్చన్‌,నయనతార జంట
    సైమా 2024 అవార్డుల వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా ఆరాధ్య బచ్చన్‌

    SIIMA 2024: సైమా 2024 అవార్డుల వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా ఆరాధ్య బచ్చన్‌,నయనతార జంట

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 16, 2024
    12:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) 2024 వేడుక దుబాయ్‌ వేదికగా అట్టహాసంగా జరిగింది.

    ఈ కార్యక్రమంలో పలు సినీతారలు పాల్గొని సందడి చేశారు. తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమల ప్రముఖ నటీనటులు ఈ వేడుకకు హాజరై అవార్డులు గెలుచుకుని తమ సత్తా చాటారు.

    ఈ వేడుకలో జరిగిన మూమెంట్స్ నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.

    వివరాలు 

    ఫొటోగ్రాఫర్‌గా ఆరాధ్య బచ్చన్ 

    సైమా అవార్డుల్లో ఐశ్వర్యారాయ్‌ (Aishwarya Rai) తన కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో కలిసి పాల్గొన్నారు. అందరి దృష్టి ఆరాధ్య వైపే ఉన్నాయి.

    ఈ వేడుకలో ఆమె తీసిన కొన్ని ఫొటోలు వైరల్‌ అయ్యాయి. ప్రత్యేకంగా, ఐశ్వర్య అవార్డు తీసుకుంటున్న సమయంలో ఆరాధ్య ఫొటో తీసే క్షణం అందరిని ఆకట్టుకుంది.

    'పొన్నియిన్‌ సెల్వన్‌-2' చిత్రానికి క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డులో ఐశ్వర్య ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. ఆమె అవార్డు స్వీకరించే క్షణాలను ఆరాధ్య తన ఫోన్‌లో బంధించారు.

    వివరాలు 

    నయనతార జంట రొమాంటిక్‌ మూమెంట్‌ 

    ఇండస్ట్రీలో క్యూట్ కపుల్స్ లో ఒక్కరైనా నయనతార - విఘ్నేశ్‌ శివన్‌ జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

    'అన్నపూరణి' సినిమాకుగాను నయనతార (Nayanthara) ఉత్తమ నటి అవార్డును పొందారు.

    ఆమె అవార్డు స్వీకరించిన తర్వాత, విఘ్నేశ్‌ వేదికపైకి వచ్చి ఆమెకు ముద్దు పెట్టి అభినందించారు.

    దీనితో నయనతార ఆనందం, భావోద్వేగానికి గురయ్యారు. ఈ వేడుకకు హాజరైన నటి సరితను నయనతార ఆప్యాయంగా పలకరించిన దృశ్యాలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

    వివరాలు 

    వేడుకగా సైమా 2024 

    సెప్టెంబరు 14, 15 తేదీలలో నిర్వహించిన ఈ వేడుకలో దక్షిణాది భాషల నటీనటులు హాజరై తమ ప్రదర్శనతో సందడి చేశారు.

    మొదటి రోజున తెలుగు,కన్నడ భాషల తారలు సందడి చెయ్యగా, రెండోరోజున తమిళ, మలయాళ సినీనటులు ఈ వేడుకకు హాజరై అవార్డులు అందుకున్నారు.

    తమిళంలో ఉత్తమ నటుడిగా విక్రమ్‌, మలయాళంలో టొవినో థామస్‌ అవార్డులు గెలుచుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా

    తాజా

    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్

    సినిమా

    Kalki 2898 AD collections: ఆగని కల్కి ఊచకూత - 7వ రోజు ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?  కల్కి 2898 AD
    Vijay Deverakonda : డియర్ రౌడీ ఫ్యాన్స్ అంటూ కీలక అప్డేట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ
    Jeetendra Madnani: సోషల్ మీడియా ట్రెండింగ్‌లో బెంగాల్ హీరో .. రీమేక్ చేస్తూ చరిత్ర సృష్టిస్తున్నఈ బెంగాల్ హీరో ఎవరో తెలుసా? సినిమా
    Urvshavi Rautela : ఆ వీడియో లీక్ చాలా బాధించింది.. ఊర్వశీ రౌతేలా బాలీవుడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025