DRAGON : ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' గ్లింప్స్కు రికార్డు రన్టైమ్.. 4 నిమిషాల 35 సెకన్ల ఊచకోత
ఈ వార్తాకథనం ఏంటి
ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'డ్రాగన్'పై అభిమానుల్లో అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నందమూరి అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు కూడా ఈ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక సంచలన అప్డేట్ బయటకు వచ్చింది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20 అర్ధరాత్రి 12 గంటలకు 'డ్రాగన్' ఫస్ట్ గ్లింప్స్ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం సిద్ధమైంది. సాధారణంగా సినిమా టీజర్లు, ట్రైలర్లు రెండు లేదా మూడు నిమిషాల నిడివిలో ఉంటాయి. అయితే ఈసారి ప్రశాంత్ నీల్ పూర్తిగా భిన్నంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
వివరాలు
అతి పెద్ద రన్ టైమ్తో గ్లింప్స్..
'డ్రాగన్' గ్లింప్స్ను ఏకంగా 4 నిమిషాల 35 సెకన్ల నిడివితో తీసుకురానున్నారు. టాలీవుడ్లో ఇంత పెద్ద రన్టైమ్తో గ్లింప్స్ విడుదల కావడం ఇదే తొలిసారి అని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రశాంత్ నీల్కు ప్రత్యేకమైన రా అండ్ మాస్ యాక్షన్ ట్రీట్మెంట్తో పాటు ఎన్టీఆర్ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ వీడియోలో హైలైట్ కానుందని సోషల్ మీడియాలో ఇప్పటికే చర్చ మొదలైంది. థియేటర్లలో అభిమానులకు పూర్తి స్థాయి మాస్ ఫీస్ట్ లాంటి అనుభూతి కలిగేలా గ్లింప్స్ ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఈ గ్లింప్స్ లాంచ్ను కేవలం దక్షిణాది వరకే పరిమితం చేయకుండా జాతీయ స్థాయిలో గ్రాండ్గా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు.
వివరాలు
ముంబైకి ఎన్టీఆర్..
ఇందుకోసం ఎన్టీఆర్ ముంబైకి వెళ్లనున్నారు. మే 19 రాత్రి నేషనల్ మీడియా సమక్షంలో ఫస్ట్ లుక్తో పాటు గ్లింప్స్ను ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు. 'కేజీఎఫ్', 'సలార్' వంటి బ్లాక్బస్టర్ చిత్రాలతో దేశవ్యాప్తంగా భారీ గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్.. ఈసారి ఎన్టీఆర్ను పూర్తిగా కొత్త తరహా పాత్రలో ఎలా చూపించబోతున్నారన్న ఆసక్తి బాలీవుడ్ వర్గాల్లో కూడా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని 2027 జూన్ 11న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే అంతకంటే ముందే విడుదల కానున్న ఈ 4 నిమిషాల 35 సెకన్ల గ్లింప్స్ సోషల్ మీడియాలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.