LOADING...
Tejaswini vygha: ఓనం లుక్ స్పెషల్.. తేజస్వినీ వైట్-గోల్డ్ చీరలో అదరగొట్టేసింది! 
ఓనం లుక్ స్పెషల్.. తేజస్వినీ వైట్-గోల్డ్ చీరలో అదరగొట్టేసింది!

Tejaswini vygha: ఓనం లుక్ స్పెషల్.. తేజస్వినీ వైట్-గోల్డ్ చీరలో అదరగొట్టేసింది! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 05, 2025
05:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ ఏడాది సెప్టెంబర్ 5న దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది, ఎందుకంటే ఒకే రోజు మూడు ముఖ్యమైన వేడుకలు పడ్డాయి. ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం, మిలాద్-ఉన్-నబి, అలాగే కేరళలో ఓనం పండుగ జరుపుకుంటున్నారు. ఓనం పండుగ కేరళలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగగా మలయాళులు ఆనందంగా జరుపుకుంటారు. ఈ సందర్భంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు భార్య తేజస్వినీ తన ప్రత్యేక పండుగ లుక్‌తో అందరిని ఆకట్టుకుంది. కేరళ సంప్రదాయానికి తగ్గట్టుగా వైట్ అండ్ గోల్డ్ చీరలో ఆమె మెరిసింది. తన పండుగ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ "ఓనం శుభాకాంక్షలు"ని అభిమానులకు తెలిపింది.

Details

సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

పలువురు సినీ ప్రముఖులు కూడా తమ బ్యూటీఫుల్ మూమెంట్స్‌ను ఈ వేడుకలో అభిమానులతో పంచుకున్నారు. తేజస్వినీ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. నెటిజన్లు "అందం అంటే ఇదే", "సింపుల్ అండ్ ఎలిగెంట్", "మలయాళ అమ్మాయి లుక్" వంటి కామెంట్లతో ఆమె ఫొటోలను ప్రశంసిస్తున్నారు. గతంతో పోలిస్తే, తేజస్వినీ ఇప్పుడు సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా మారింది. తన వ్యక్తిగత ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తున్నారు. ఓనం కేవలం పండుగ మాత్రమే కాదు, అది కేరళ సంస్కృతి, సంప్రదాయం ప్రతీక.

Details

ట్రెడిషనల్ లుక్‌తో  తేజస్వీని

మహాబలి చక్రవర్తి ఆగమనాన్ని స్వాగతిస్తూ, సంప్రదాయ వస్త్రధారణ, పూకలం (పూల ముగ్గులు), సదీ (విందు భోజనం)లతో మలయాళులు పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ విధంగా, తేజస్వినీ తన ట్రెడిషనల్ లుక్‌తో ఈ ఓనం వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గతంలో ఎక్కువగా భర్త దిల్ రాజు, తనయుడు అన్వి రెడ్డితో ఫొటోలు షేర్ చేస్తూ ఉండేదే, కానీ ఇప్పుడు ఆమె వ్యక్తిగత ఫొటోలు ఎక్కువగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు, ఇవి తెగ వైరల్ అవుతున్నాయి.