
Peddi : 'పెద్ది' షూటింగ్ 50శాతం పూర్తి.. రామ్ చరణ్ యాక్టింగ్ పై రత్నవేలు ఆసక్తికర వ్యాఖ్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'పెద్ది'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానున్న ఈ చిత్రం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. తాజాగా మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ఆసక్తికర అప్డేట్ పంచుకున్నారు. ఇప్పటివరకు సుమారు 50 శాతం షూటింగ్ పూర్తయిందని, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రపంచంలోని పలు భాషల్లో ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని సన్నాహాలు జరుగుతున్నాయి.
Details
అభిమానుల్లో భారీ అంచనాలు
ఇక తాజాగా ఓ అవార్డ్ ఫంక్షన్లో పాల్గొన్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, రామ్ చరణ్ నటనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాతో రామ్ చరణ్ మరో కొత్త కోణాన్ని తన నటనతో చూపించబోతున్నారని పేర్కొన్నారు. ఆయన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే రత్నవేలు, సినిమా ఇప్పటికే సగం పూర్తయిందని, బలమైన స్క్రిప్ట్ కారణంగా ఈ చిత్రాన్ని సాధారణ స్టైల్లో కాకుండా ప్రత్యేకంగా, డిఫరెంట్ విజువల్ ట్రీట్మెంట్తో తెరకెక్కిస్తున్నామని తెలిపారు. ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచాయి. ఇప్పుడు రామ్ చరణ్ అభిమానులు 'పెద్ది' కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సినీమాటిక్ ఎక్స్పీరియన్స్, చరణ్ కొత్త నటనా కోణం ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.