Salaar: సలార్ ఫస్ట్ టికెట్ కొనుగోలు చేసిన రాజమౌళి
ఈ వార్తాకథనం ఏంటి
కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్- పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో రూపొందించిన చిత్రం సలార్ పార్ట్-1: సీజ్ ఫైర్.
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 22న విడుదల కానున్న నేపథ్యంలో టికెట్ల బుకింగ్స్ను శనివారం ఓపెన్ చేశారు.
ఈ క్రమంలో ఈ సినిమా తొలి టిక్కెట్ను దిగ్గజ దర్శకుడు రాజమౌళి కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్లో రాజమౌళి టికెట్ను బుక్ చేసుకున్నారు.
రూ.10,116కు రాజమౌళి టికెట్ కొనడంతో ఈ అంశం వైరల్గా మారింది. ఇక ఈ మూవీ డిస్ట్రిబ్యూటింగ్ విషయానికి వస్తే.. నైజాం హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ దక్కించుకున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్
THE PRIDE OF INDIAN CINEMA @ssrajamouli buys the first ticket of INDIA'S BIGGEST ACTION FILM #Salaar in Nizam from the team and producer #NaveenYerneni ❤️🔥
— Mythri Movie Makers (@MythriOfficial) December 16, 2023
Nizam Release by @MythriOfficial 💥
Bookings open very soon in a grand manner with some Massive Celebrations 😎🔥… pic.twitter.com/d75n500YwS