పంజా వైష్ణవ్ తేజ్ నాలుగవ సినిమా గ్లింప్స్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే?
పంజా వైష్ణవ్ తేజ్ తన నాలుగవ సినిమాను కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుందని ప్రకటించారు కూడా. అంతేకాదు బీస్ట్ సినిమాలో నటించిన అపర్ణదాస్, ఈ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. మళయాలీ నటుడైన జోజు జార్జ్ కూడా తెలుగులో ఈ సినిమాతో పరిచయం కాబోతున్నాడు. గతంలో వైష్ణవ్ తేజ్ నటించిన సినిమాల మాదిరి కాకుండా, ఈసారి యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుందట. ఈ చిత్ర గ్లింప్స్, ఈరోజు సాయంత్రం 4:05గంటలకు రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. సితార్ ఎంటర్ టైన్మెంట్స్, ఫార్ఛూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.