Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
ఈ వార్తాకథనం ఏంటి
సీనియర్ స్టార్ హీరోలతో సినిమా అంటే సాధారణంగా షూటింగ్ పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది. ఇక పాన్ ఇండియా సినిమా అయితే ఈ వ్యవధి మరింత పెరుగుతుంది. అయితే సూపర్స్టార్ రజినీకాంత్తో ఓ యంగ్ డైరెక్టర్ మాత్రం ఇందుకు భిన్నంగా ప్లాన్ చేస్తున్నాడు. కేవలం ఐదు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసి.. వచ్చే సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గుర్తుకు రావడం సహజమే. ఆయన కూడా తక్కువ సమయంలో సినిమాలను పూర్తి చేసి.. వేగంగా విడుదల చేయడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
వివరాలు
అశ్వత్ మారిముత్తుకు ఆ స్టార్ హీరో అవకాశం..
ఇప్పుడు అదే తరహాలో కోలీవుడ్కు చెందిన యంగ్ డైరెక్టర్ రజినీకాంత్తో సినిమా చేస్తున్నాడు.
'ఓ మై కడవులే', 'డ్రాగన్' వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అశ్వత్ మారిముత్తుకు రజినీకాంత్ స్వయంగా అవకాశం ఇచ్చినట్లు సమాచారం.
పలువురు దర్శకుల పేర్లను పరిశీలించిన అనంతరం.. 'తలైవర్ 173' బాధ్యతలను అశ్వత్కు అప్పగించినట్లు తెలుస్తోంది.
వివరాలు
కొనసాగుతున్న షూటింగ్..
ఈ సినిమాకు 'ధర్మన్: ది డెడ్లీ డాక్టర్' అనే టైటిల్ను మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
జూన్లో షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రంలో సిమ్రాన్, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
రామ్ పోతినేని కీలక పాత్రలో కనిపించనున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను కమల్ హాసన్ నిర్మిస్తున్నారు.
ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తికాగా.. ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ కొనసాగుతోంది.