
Sandeep Reddy Vanga: స్పిరిట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు రామ్ చరణ్ దంపతుల స్పెషల్ గిఫ్ట్
ఈ వార్తాకథనం ఏంటి
'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' వంటి బ్లాక్బస్టర్ హిట్లతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం పాన్ఇండియా స్టార్ ప్రభాస్తో 'స్పిరిట్' అనే భారీ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా నుంచి ఇటీవల వరుసగా అప్డేట్లు వస్తుండగా, తాజాగా హీరోయిన్ ఎంపిక విషయమే టాలీవుడ్తో పాటు బాలీవుడ్లోనూ హాట్ టాపిక్గా మారింది.
ఇప్పటివరకు ఈ చిత్రంలో దీపికా పదుకొణే హీరోయిన్గా నటిస్తారని వార్తలు వెలువడ్డాయి.
అయితే, తాజా సమాచారం మేరకు దీపిక స్థానంలో త్రిప్తి డిమ్రీని అధికారికంగా ఎంపిక చేశారు.
Details
'అత్తమ్మాస్ కిచెన్' పేరుతో ఆహార ఉత్పత్తులు
ఈ క్రమంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియా ద్వారా ఓ పోస్ట్ పెట్టగా, దీపికా కూడా అంతే స్థాయిలో ఓ పోస్ట్ పెట్టడం ఇంటర్నెట్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ హాట్ టాపిక్ నడుస్తున్న వేళ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులు సందీప్ రెడ్డికి సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించి వార్తల్లో నిలిచారు.
మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, కోడలు ఉపాసన కలిసి 'అత్తమ్మాస్ కిచెన్' పేరుతో ఆహార ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
ఇటీవల ఆవకాయ పచ్చడిని ఈ బ్రాండ్ మెనూలో చేర్చారు.
Details
అవకాయ రుచి అదుర్స్
ఈ స్పెషల్ ఆవకాయ పచ్చడిని ఓ జాడీ రూపంలో సందీప్ రెడ్డికి రామ్ చరణ్ - ఉపాసన పంపారు.
ఈ గిఫ్ట్కి సంబంధించిన ఫోటోలను సందీప్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, రామ్ చరణ్, ఉపాసనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఆవకాయ రుచి అదుర్స్ అంటూ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.