Rashmika Mandanna: పుట్టింటికి వెళ్లి బాల్యాన్ని గుర్తుచేసుకున్న రష్మిక.. స్కూల్ చూసి ఎమోషన్.. ఫొటోలు షేర్
ఈ వార్తాకథనం ఏంటి
ఈ నెల 5న జరిగిన తన 30వ పుట్టినరోజు వేడుకల గురించి నటి రష్మిక మందన్న తాజాగా భావోద్వేగ పోస్టు షేర్ చేశారు. భర్త, అత్తమామలు, బంధువులు, స్నేహితులతో కలిసి ఈ వేడుకలను జరుపుకోవడం తనకు ఎంతో ప్రత్యేకంగా అనిపించిందని తెలిపారు. ఆ సందర్భానికి సంబంధించిన ఫొటోను పంచుకుంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. 'కొన్ని రోజుల తర్వాత ఇంటికి వెళ్లే అవకాశం దొరికింది. చిన్నప్పటి నుంచి వెళ్లే ఆలయాన్ని సందర్శించాను. సమయం తక్కువగా ఉండటంతో నేను చదివిన స్కూల్ను బయట నుంచే చూడాల్సి వచ్చింది. అయితే, స్కూల్ కనిపించగానే నా బాల్య జ్ఞాపకాలు ఒక్కసారిగా గుర్తొచ్చాయి. కుటుంబ సభ్యుల్లా భావించే స్కూల్ ఫ్రెండ్స్లో కొందరిని కలిసాను.
వివరాలు
పెళ్లి తర్వాత రష్మికకు ఇదే తొలి పుట్టినరోజు
నేను ఈ స్థాయికి చేరడానికి కారణమైన వారు,ఎప్పుడూ నాతో ఉండే వారి మధ్య కేక్ కట్ చేయడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. నా పెళ్లికి రాలేకపోయిన కుటుంబ సభ్యులను ఈవేడుకలో కలిసే అవకాశం వచ్చింది. నేను పుట్టినప్పటి నుంచి నన్ను ఆశీర్వదిస్తూ వచ్చిన వారందరినీ ఒకేచోట చూడటం చాలా ఆనందంగా అనిపించింది. జీవితంలో జరిగే ప్రతి విషయానికీ ఒక మంచి కారణం ఉంటుందని నేను నమ్ముతాను... ఆ కారణం ఇదేననిపించిందని రష్మిక తన పోస్టులో పేర్కొన్నారు. పెళ్లి తర్వాత రష్మికకు ఇదే తొలి పుట్టినరోజు వేడుక కావడం విశేషం. ఆమె స్వస్థలం కర్ణాటకలోని కొడుగు జిల్లా విరాజ్పేట్ గ్రామం. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి 'రణబాలి' చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు.