SDT 19: సాయి దుర్గ తేజ్ భారీ ప్రాజెక్ట్.. కాన్సెప్ట్ పోస్టర్ అదుర్స్
ఈ వార్తాకథనం ఏంటి
మెగా హీరో సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం తన కెరీర్లో అత్యంత ముఖ్యమైన దశలో కొనసాగుతున్నారు. వరుసగా పెద్ద సినిమాలను అంగీకరిస్తూ ముందుకు సాగుతున్నారు. కొత్త దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్న 'సంబరాల ఏటిగట్టు' చిత్రంలో ఆయన నటిస్తున్నారు. సుమారు రూ.150 కోట్ల భారీ వ్యయంతో నిర్మితమవుతున్న ఈ సినిమా ఇప్పటికే పరిశ్రమలో విశేష చర్చకు దారి తీసింది. పీరియడ్ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రంలో క్లైమాక్స్కే దాదాపు రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నారని సమాచారం. దాన్నిబట్టి ఈ సినిమా స్థాయి ఎంత భారీగా ఉందో అర్థమవుతుంది.
వివరాలు
కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్
ఈ పాన్-ఇండియా చిత్రం షూటింగ్ కొనసాగుతుండగానే, తేజ్ తన తదుపరి ప్రాజెక్ట్కు కూడా ఓకే చెప్పారు. గత సంవత్సరం 'క' సినిమాతో సాంకేతికంగా కొత్త ట్రెండ్ సెట్ చేసి ఘన విజయాన్ని అందుకున్న దర్శకులు సుజిత్, సందీప్లతో సాయి దుర్గ తేజ్ తన తదుపరి చిత్రం (SDT 19) చేయనున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ నిర్మిస్తోంది. ఏప్రిల్ 3న ఈ ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటిస్తూ, ఒక కాన్సెప్ట్ పోస్టర్ను విడుదల చేశారు.
వివరాలు
నెట్టింట వైరల్ అవుతున్న పోస్టర్
ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. 'విరూపాక్ష' లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ తర్వాత తేజ్ మళ్లీ ప్రయోగాత్మక కథల వైపు మొగ్గు చూపడం గమనార్హం. 'క' దర్శకుల ప్రతిభ, షైన్ స్క్రీన్స్ నిర్మాణ ప్రమాణాలు కలిసి వస్తే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరో పెద్ద విజయాన్ని నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని అభిమానులు, సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక్క పోస్టర్తోనే సినిమాపై అంచనాలు గణనీయంగా పెరిగాయి. భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కావచ్చని సమాచారం.