Manamey: శర్వానంద్,కృతి శెట్టి కొత్త సినిమా 'మనమే'
టాలీవుడ్ నటుడు శర్వానంద్,దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కాంబోలో ఓ సినిమా చెయ్యబోతున్నాడు. శర్వానంద్ కి ఇది 35వ చిత్రం.ఈ రోజు శర్వానంద్ బర్త్ డే కానుకగా మేకర్స్ బ్యూటిఫుల్ అప్డేట్ ని అందించారు. ఒక ప్లెజెంట్ మోషన్ పోస్టర్ టీజర్ కట్ తో "మనమే" అంటూ టైటిల్ ని లాక్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ స్నీక్ పీక్లో, పెయింటింగ్ రోల్ పట్టుకొని శర్వానంద్, విక్రమ్ ఆదిత్య (దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కుమారుడు)తో పాటు కనిపిస్తున్నారు. దీనితో ఈ సినిమా మంచి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నట్టుగా అర్ధం అవుతుంది.
త్వరలో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు
కృతి శెట్టి కథానాయికగా ఎంపికైంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. ఏడిద రాజా అసోసియేట్ ప్రొడ్యూసర్గా టిజి విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం హీషం అబ్దుల్ వాహద్ అందిస్తున్నాడు.