NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Pahalgam Terror attack: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి కలకలం - క్షేమంగా బయటపడ్డ నటి దీపికా కాకర్ దంపతులు 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Pahalgam Terror attack: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి కలకలం - క్షేమంగా బయటపడ్డ నటి దీపికా కాకర్ దంపతులు 
    జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి కలకలం - క్షేమంగా బయటపడ్డ నటి దీపికా కాకర్ దంపతులు

    Pahalgam Terror attack: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి కలకలం - క్షేమంగా బయటపడ్డ నటి దీపికా కాకర్ దంపతులు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 23, 2025
    10:35 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మంగళవారం మధ్యాహ్నం జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రవాద దాడిలో పలువురు అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదన కలిగించింది.

    ఈ దాడి సమయంలో కొంతమంది పర్యాటకులు ఎంతో కష్టం మీద ప్రాణాలను అరచేత పట్టుకొని బయటపడ్డారు.

    ఈ నేపథ్యంలో ప్రముఖ టెలివిజన్ నటి దీపికా కాకర్ తన భర్త, నటుడు షోయబ్ ఇబ్రాహీమ్‌తో కలిసి ఇటీవల కశ్మీర్‌కి విహారయాత్రకు వెళ్లిన విషయం వెలుగులోకి వచ్చింది.

    ఆదివారం నాడు వీరు తమ కశ్మీర్ పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.

    అందమైన కశ్మీరీ ప్రకృతి మధ్య తీయటి క్షణాలను వీరు అభిమానులతో షేర్ చేశారు.

    వివరాలు 

    కశ్మీర్ నుంచి బయలుదేరి ప్రస్తుతం దిల్లీకి..

    అయితే మంగళవారం జరిగిన ఉగ్రదాడి వార్త వెలుగులోకి రావడంతో వీరి అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

    దీపికా, షోయబ్ దంపతులు ఈ ఘటనలో ఏమైనా చిక్కుకున్నారా అనే అనుమానంతో పలువురు నెటిజన్లు మెసేజ్‌లు పంపుతూ వారి క్షేమాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు.

    తాజాగా, దీపికా మరియు షోయబ్ ఇబ్రాహీమ్ దిల్లీకి సురక్షితంగా చేరుకున్నారని తెలియజేస్తూ ఓ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.

    "మేం క్షేమంగా ఉన్నాం. మంగళవారం ఉదయమే కశ్మీర్ నుంచి బయలుదేరి ప్రస్తుతం దిల్లీకి సురక్షితంగా వచ్చాం. దయచేసి ఎవరూ ఆందోళన చెందకండి" అని షోయబ్‌ ద్వారా వెల్లడించారు.

    వివరాలు 

    షోయబ్‌ పోస్ట్‌పై విమర్శలు 

    అయితే షోయబ్ పోస్ట్‌పై కొన్ని విమర్శలు కూడా ఎదురయ్యాయి.

    దేశమంతా ఈ దాడిపై విషాదంలో మునిగిపోయిన వేళ, తన కశ్మీర్ పర్యటనపై వ్లాగ్ రూపొందిస్తున్నట్లు షోయబ్ ప్రకటించడం కొంతమంది నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది.

    ''ఇలాంటి ఘోరమైన ఘటనలు జరుగుతున్న సమయంలో కూడా మీ వ్లాగ్ ప్రచారం అవశ్యకమా?'' అంటూ పలువురు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.

    మరోవైపు, మినీ స్విట్జర్లాండ్‌గా పిలవబడే పహల్గాం సమీపంలోని బైసరన్ ప్రాంతంలో కొండల మధ్య పర్యటిస్తున్న పర్యాటకులపై మంగళవారం ఉగ్రవాదులు ఆకస్మికంగా దాడికి దిగారు.

    ఈ దాడిలో మొత్తం 28 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ అమానుష దాడిపై దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్ముకశ్మీర్

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    జమ్ముకశ్మీర్

    Jammu Kashmir: లోయలో పడిన వాహనం.. ఐదుగురు సైనికుల మృతి భారతదేశం
    Katra Ropeway Project: జమ్మూకశ్మీర్‌లోని వైష్ణోదేవి రోప్‌వే నిర్మాణానికి వ్యతిరేకంగా కాట్రాలో72 గంటల పాటు బంద్  భారతదేశం
    Snowfall: జమ్ముకశ్మీర్‌లో హిమపాతం వల్ల రవాణా సమస్యలు.. నిలిచిపోయిన 2వేల వాహనాలు శ్రీనగర్
    Heavy Snowfall: జమ్మూ కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు.. యూనివర్సిటీ పరీక్షలు వాయిదా భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025