Page Loader
Shobha Shetty : అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన కార్తీక దీపం సీరియల్ నటీ శోభాశెట్టి.. ఏం చేసిందో తెలుసా
ఏం చేసిందో తెలుసా

Shobha Shetty : అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన కార్తీక దీపం సీరియల్ నటీ శోభాశెట్టి.. ఏం చేసిందో తెలుసా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jan 02, 2024
04:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

కార్తీకదీపం సీరియల్‌లో మోనితగా నటించి, బుల్లితెర ప్రేక్షకులను మెప్పించిన శోభాశెట్టి బిగ్‌ బాస్'తో మరింత క్రేజ్‌ సంపాదించుకుంది. ఈ మేరకు షోలోనే తన ప్రియుడు,ప్రేమ గురించి చెప్పి అందరికీ ఝలక్ ఇచ్చింది శోభ. కార్తీక దీపం సీరియల్‌లో తనతో పాటు నటించిన యశ్వంత్ రెడ్డితో ప్రేమలో ఉన్నట్లు చెప్పి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపర్చింది. తాజాగా అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. యశ్వంత్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు అధికారిక యూట్యూబ్‌ ఛానెల్‌లో ఓ వీడియో అప్‌లోడ్‌ చేసిందీ కన్నడ భామ. కొత్త సంవత్సరం సందర్భంగా ఓ టీవీషో స్టేజ్‌పైనే తమకు ఎంగేజ్‌మెంట్ జరిగిందని,ఈ మేరకు ఇద్దరూ పూల దండలు మార్చుకుని ఉంగరాలు తొడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.

Details

క్రేజీ కామెంట్లు పెడుతున్న అభిమానులు

ఒక టీవీ ప్రోగ్రాం కోసమే శోభ, యశ్వంత్‌లు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారని తెలియడంతో అభిమానులు క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. బిగ్ బాస్ ఏడో సీజన్‌లో టాప్‌ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టి, తన అందంతో అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేనా ఆటతీరు, మాటతీరుతో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది ఈ కన్నడ భామ. ముఖ్యంగా బిగ్‌ బాస్‌ హౌజ్‌'లో స్పై (శివాజీ, పల్లవి ప్రశాంత్‌, ప్రిన్స్‌ యావర్‌) బ్యాచ్‌తో సై అంటూ సై పోటీ పడింది. మాటకు మాట ఇస్తూ చుక్కలు చూపించింది.ఇదే శోభకు కాస్త ఇబ్బందిని కలిగించింది. ఆమె ప్రవర్తన శ్రుతిమించిందంటూ కామెంట్స్‌ వినిపించాయి.దీంతో ఓటింగ్‌పైనా ప్రభావం పడింది. ఫలితంగా గ్రాండ్‌ ఫినాలేకు చేరకుండానే బిగ్‌ బాస్‌ హౌజ్‌ నుంచి నిష్క్రమించింది.