రామాలయాలకు ఉచితంగా ఆదిపురుష్ టిక్కెట్లు: కేవలం ఆ జిల్లాలో మాత్రమే
ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ చిత్రం జూన్ 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. రామాయణ గాథను ప్రతీ ఒక్కరూ థియేటర్లలో త్రీడీ వెర్షన్ లో చూడాలన్న ఆలోచనతో ఇప్పటికే అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థ పదివేల టిక్కెట్లను ఉచితంగా అందిస్తోంది. బాలీవుడ్ నటుడు రణ్ బీర్ కపూర్ కూడా పదివేల టికెట్లను ఉచితంగా ఇవ్వనున్నాడని ప్రచారం జరిగింది. తాజాగా ఈవెంట్స్ ఆర్గనైజర్ శ్రేయాస్ మీడియా కూడా ఇలాంటి ఆలోచనతో ముందుకు వచ్చింది. ఖమ్మం జిల్లాలోని ప్రతీ గ్రామ రామాలయానికి 101టిక్కెట్లను ఉచితంగా అందిస్తామని శ్రేయాస్ మీడియా అధినేత శ్రేయాస్ శ్రీనివాస్ వెల్లడి చేసారు. ఆదిపురుష్ బుకింగ్స్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయాయి. మొదటిరోజు రికార్డు స్థాయి వసూళ్ళు ఉండబోతున్నాయని అంచనా వేస్తున్నారు.