Srinivasa Mangapuram: 'శ్రీనివాస మంగాపురం'కు సెన్సార్ గ్రీన్ సిగ్నల్.. యూ/ఏ సర్టిఫికెట్తో రిలీజ్కు రెడీ!
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్స్టార్ మహేశ్బాబు సోదరుడు రమేశ్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'శ్రీనివాస మంగాపురం' విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) యూ/ఏ (U/A) సర్టిఫికెట్ జారీ చేసింది. దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ చిత్రం జులై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రాషా థడానీ తెలుగు ఎంట్రీ ఈ సినిమాలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా థడానీ కథానాయికగా నటిస్తూ తెలుగు చిత్రసీమలో అడుగుపెడుతోంది. దీంతో ఈ సినిమాపై బాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది.
వివరాలు
తిరుపతి నేపథ్యంలో సాగే ప్రేమకథ
తిరుపతి నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రంలో వాసుబాబు, మంగా అనే ఇద్దరు స్నేహితులు ప్రేమికులుగా మారిన తర్వాత వారి జీవితాల్లో చోటుచేసుకునే అనూహ్య పరిణామాల చుట్టూ కథ సాగుతుంది.
భావోద్వేగాలు, ప్రేమ, డ్రామాతో ఈ కథను తెరకెక్కించినట్లు చిత్రబృందం తెలిపింది.
అజయ్ భూపతిపై భారీ అంచనాలు
'ఆర్ఎక్స్ 100', 'మంగళవారం' వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాకు దర్శకత్వం వహించడం వల్ల ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి.
అదే సమయంలో సూపర్స్టార్ కృష్ణ, మహేశ్బాబు వారసత్వాన్ని కొనసాగిస్తూ జయకృష్ణ ఘట్టమనేని హీరోగా వెండితెరకు పరిచయం అవుతుండటం ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
వివరాలు
విలన్గా మోహన్బాబు.. జి.వి. ప్రకాష్ సంగీతం
ఈ చిత్రంలో సీనియర్ నటుడు మోహన్బాబు ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. అశ్వినీదత్ సమర్పణలో చంద్రమామ కథలు బ్యానర్పై పి. కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సంగీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ అందించారు.
సెన్సార్ ప్రక్రియ పూర్తి చేసుకున్న 'శ్రీనివాస మంగాపురం'.. జులై 30న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.