NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ పాటల రచయిత కన్నుమూత
    తదుపరి వార్తా కథనం
    Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ పాటల రచయిత కన్నుమూత
    టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం

    Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ పాటల రచయిత కన్నుమూత

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 12, 2024
    12:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ పాటల రచయిత గురు చరణ్ (77) కన్నుమూశారు.

    ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా, గురువారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు.

    ఆయన రచించిన అనేక విషాద గీతాలు ఇప్పటికీ ఏవర్ గ్రీన్‌గా ఉంటాయి. ముఖ్యంగా, మోహన్ బాబు కోసం ఆయన ప్రత్యేకంగా పాటలు రాసేవారు.

    మోహన్ బాబుకు కూడా గురు చరణ్ మీద ప్రత్యేకమైన అభిమానం ఉండేది, అందుకే తన సినిమాల కోసం ఆయనను ప్రత్యేకంగా ఎంపిక చేసేవారు.

    'ముద్దబంతి పువ్వులో మూగబాసలు', 'కుంతీకుమారి తన కాలుజారి', 'బోయవాని వేటుకు గాయపడిన కోయిలా' వంటి అద్భుతమైన పాటలను మోహన్ బాబుకు అందించారు.

    వివరాలు 

     సినీ ప్రముఖులు, పాటల అభిమానులు దిగ్బ్రాంతి 

    గురు చరణ్ ప్రముఖ గీత రచయిత ఆచార్య ఆత్రేయ దగ్గర శిష్యరికం చేశారు. ఆయన 200కి పైగా పాటలు రాశారు.

    మోహన్ బాబు చిత్రాలలో కనీసం ఒక పాట అయినా గురు చరణ్‌తో రాయించేవారు.

    ఆయన అందించిన ఎన్నో మెలోడీ, అర్థవంతమైన పాటలు మోహన్ బాబు సినిమాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి.

    గురు చరణ్ మృతి పట్ల సినీ ప్రముఖులు, పాటల అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

    గురు చరణ్ అసలు పేరు మానాపురపు రాజేంద్రప్రసాద్.ఆయన అలనాటి ప్రముఖ నటి ఎం.ఆర్.తిలకం,దర్శకుడు మానాపురం అప్పారావుల కుమారుడు.గురు చరణ్ ఎం.ఏ వరకు విద్యను అభ్యసించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టాలీవుడ్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    టాలీవుడ్

    Bellamkonda Sreenivas: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ,అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంటగా కొత్త మూవీ సినిమా
    Allu Arjun: అల్లు అర్జున్ వాడే వ్యానిటీ వ్యాన్ విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే అల్లు అర్జున్
    Prabhas : ప్రభాస్ ఫ్రాన్స్‌కు సూపర్ న్యూస్.. 'రాజా సాబ్' ఫస్ట్ లుక్ వచ్చేస్తోంది  ప్రభాస్
    TFC : ముగిసిన ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు.. నూతన అధ్యక్షుడిగా భరత్ భూషణ్ దిల్ రాజు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025