
NTRNeel : 'డ్రాగన్' సినిమా తొలి షెడ్యూల్ ముగిసింది
ఈ వార్తాకథనం ఏంటి
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'డ్రాగన్'. ఈ చిత్రంలో కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు.
ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం, దేవర వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత రావడంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు.
గత నెల 22న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా సెట్లో అడుగుపెట్టాడు. మొదటి షెడ్యూల్ రామోజీ ఫిల్మ్స్ స్టూడియోలో ప్రారంభమైంది.
తరువాత కర్ణాటకలో షూటింగ్ ముగిసింది. హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం.
Details
కీలక పాత్రలో మలయాళ హీరో
ప్రశాంత్ నీల్ ఈ యాక్షన్ ఫైట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల తర్వాత సెకండ్ షెడ్యూల్ ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
మలయాళ యంగ్ హీరో టోవినో థామస్ ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.
ఈ సినిమా రైట్స్ కోసం ఇప్పటికే భారీ డిమాండ్ ఏర్పడింది, ప్రత్యేకంగా ఓవర్సీస్ రైట్స్ కోసం ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ రూ. 50 కోట్లకు కొనుగోలు చేసేందుకు రెడీ అయ్యాడు.
కేజీఎఫ్ సంగీత దర్శకుడు రవి బస్రుర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది.