Guntur Kaaram: 'గుంటూరు కారం' మొదటి సింగిల్ లీక్.. పాట రిలీజ్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత
సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోయే చిత్రం 'గుంటూరు కారం' నుంచి మొదటి సింగిల్ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో సినిమా యూనిట్కు ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమాలోని 'మసాలా బిర్యానీ' పాట లీకై.. నెట్టింట వైరల్గా మారింది. దీంతో చిత్ర యూనిట్, అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. ఈ క్రమంలో తొలి పాట విడుదల గురించి అప్డేట్ ఇవ్వమని ప్రొడక్షన్ హౌస్ని అభిమానులు అడగడం ప్రారంభించారు. దీంతో స్పందించిన చిత్ర నిర్మాత నాగవంశీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 7న ఫస్ట్ సింగిల్ రాబోతుందని నాగ వంశీ వెల్లడించారు. మొదటి సాంగ్ లీకైన పాట ఉంటుందా? సింగిల్ మెలోడీ అవుతుందా? అనేది ఆకసక్తికరంగా మారింది.