Telangana Telivision Awards: టీవీ అవార్డ్స్ ఏర్పాట్లకు రంగం సిద్ధం.. కమిటీ ఛైర్మన్గా శరత్ మరార్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టెలివిజన్ రంగంలో విశిష్ట ప్రతిభ కనబరిచిన వారిని సత్కరించేందుకు 'తెలంగాణ టెలివిజన్ అవార్డ్స్ 2024'ను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ అవార్డుల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వం ప్రారంభించింది. కార్యక్రమానికి సంబంధించిన విధానాలు, నియమావళి, లోగో రూపకల్పన వంటి అంశాలను ఖరారు చేయడానికి 15 మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ప్రముఖ నిర్మాత శరత్ మరార్ను ఛైర్మన్గా నియమించగా, టీజీఎఫ్డీసీ మేనేజింగ్ డైరెక్టర్ను కన్వీనర్గా నియమించారు. టెలివిజన్ పరిశ్రమ నుంచి కె. బాపినీడు, మంజుల నాయుడు, పి. కిరణ్ వంటి ప్రముఖులు కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
Details
ప్రభుత్వ సంకల్పానికి ప్రతీకగా నిలుస్తాయి
అవార్డుల ఫ్రేమ్వర్క్, విజన్ రూపకల్పన, అన్ని విభాగాల్లో పారదర్శకత, సమగ్రత, సృజనాత్మకతను నిర్ధారించడం ఈ కమిటీ ప్రధాన బాధ్యతగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రస్తుతం సినీ, టెలివిజన్ రంగాల్లో ఒక ప్రధాన కేంద్రంగా ఎదుగుతోంది. 'తెలంగాణ టెలివిజన్ అవార్డ్స్ 2024' ద్వారా స్థానిక సృజనాత్మక ప్రతిభను గౌరవించడానికి, ప్రోత్సహించడానికి ఒక వేదికను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ అవార్డులు తెలంగాణ సృజనాత్మకతను, స్థానిక ప్రతిభను ప్రోత్సహించే ప్రభుత్వ సంకల్పానికి ప్రతీకగా నిలుస్తాయని ఆయన స్పష్టం చేశారు.