Page Loader
Rashmika Mandanna: కుటుంబ కష్టాలను అధిగమించి, నేషనల్ క్రష్‌గా ఎదిగిన రష్మిక జర్నీ ఇదే!
కుటుంబ కష్టాలను అధిగమించి, నేషనల్ క్రష్‌గా ఎదిగిన రష్మిక జర్నీ ఇదే!

Rashmika Mandanna: కుటుంబ కష్టాలను అధిగమించి, నేషనల్ క్రష్‌గా ఎదిగిన రష్మిక జర్నీ ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 04, 2025
03:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

సినీ ప్రేమికుల హృదయాలను దోచుకున్న రష్మిక మందన్న, ఏప్రిల్ 5న తన 28వ పుట్టినరోజు జరుపుకుంటోంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె, 'కిరిక్‌ పార్టీ' సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ తర్వాత 'ఛలో' ద్వారా టాలీవుడ్‌కు పరిచయమై, 'గీత గోవిందం', 'సరిలేరు నీకెవ్వరు', 'పుష్ప', 'యానిమల్‌' వంటి సూపర్ హిట్ చిత్రాలతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. రూమర్స్‌, డీప్‌ ఫేక్‌ వీడియోల వంటి సమస్యలను ఎదుర్కొన్నా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది. ఇప్పుడు ఆమె పాన్‌ ఇండియా స్టార్‌గా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

Details

మోడలింగ్ నుంచి సినిమాల వరకు 

1996 ఏప్రిల్ 5న కర్ణాటకలోని విరాజ్‌పేట్‌లో జన్మించిన రష్మిక, కోడగు జిల్లాలోని కూర్గ్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకుంది. ఆ తర్వాత M.S. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుంచి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్నా, చదువుపై కూడా సమానమైన ప్రాధాన్యం ఇచ్చింది. మోడలింగ్‌లో అవకాశాలు రావడంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. రక్షిత్‌ శెట్టి 'కిరిక్‌ పార్టీ' చిత్రానికి ఆమెను ఎలాంటి ఆడిషన్ లేకుండా సెలెక్ట్ చేయడం, ఆమె టాలెంట్‌ను బయటకు తెచ్చింది.

Details

పేదరికం నుంచి కోటీశ్వరురాలిగా రష్మిక 

చిన్నప్పుడు అద్దె ఇంట్లో జీవితం ప్రారంభించిన రష్మిక కుటుంబం, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. రెంట్లు కట్టలేక, ఎన్నోసార్లు ఇళ్లను మార్చుకోవాల్సి వచ్చింది. తండ్రి వ్యాపారాల్లో నష్టాలను ఎదుర్కొనడం చూసి, ఆ పరిస్థితిని మార్చాలని ఆమె కృతనిశ్చయంతో పని చేసింది. సినీ కెరీర్‌లో స్థిరపడిన తర్వాత, తన తల్లిదండ్రులకు ఓ లగ్జరీ ఇంటిని గిఫ్ట్‌గా ఇచ్చింది. ఇప్పటికి కూడా తన సంపాదనలో చాలా భాగాన్ని తండ్రికి అప్పగిస్తూ, వ్యాపారాల్లో పెట్టుబడి పెడుతోంది.

Details

 సినిమా కెరీర్ - ఛలో టు పుష్ప 

'కిరిక్ పార్టీ' హిట్‌తో 'ఛలో' సినిమాలో అవకాశం దక్కించుకుంది. తరువాత వచ్చిన 'గీత గోవిందం'తో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మారింది. కెరీర్‌లో ఒడిదొడుకులు వచ్చినా, పుష్ప సినిమాతో మళ్లీ ట్రెండ్‌ సెట్‌ చేసింది. ఇప్పుడు పుష్ప 2తో మరింత శక్తివంతమైన పాత్రలో కనిపించనుంది. రెమ్యునరేషన్, ఆస్తులు కిరిక్ పార్టీ సినిమా కోసం మొదట ఆమె రూ.1.50 లక్షల రెమ్యునరేషన్ మాత్రమే తీసుకుంది. కానీ ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.5 కోట్లకు పైగా డిమాండ్ చేస్తోంది. యానిమల్ సినిమాకైతే రూ.7 కోట్లు తీసుకున్నట్లు టాక్. సినీ రెమ్యునరేషన్‌తో పాటు, బ్రాండ్ ఎండోర్స్మెంట్స్ ద్వారా కూడా భారీగా సంపాదిస్తోంది.

Details

లగ్జరీ హౌస్‌లు, కార్స్‌ 

ఒక్కో ప్రకటనకు రూ.70 లక్షల నుంచి రూ.1 కోటి వరకు తీసుకుంటుందట. ప్రస్తుతం ఆమె మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.70 కోట్లకు చేరిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. 23 ఏళ్లకే కోటీశ్వరురాలిగా మారిన రష్మికకు బెంగళూరు, కూర్గ్, గోవా, హైదరాబాద్, ముంబై వంటి నగరాల్లో విలాసవంతమైన ఇళ్లు ఉన్నాయి. బెంగళూరులోని ఆమె లగ్జరీ ఇంటి విలువ దాదాపు రూ.10 కోట్లు ఉంటుందని అంచనా. కార్లకు చాలా ఇష్టమైన రష్మిక గ్యారేజీలో టయోటా ఇన్నోవా, ఆడి క్యూ3, మెర్సిడెస్ బెంజ్ C క్లాస్, రేంజ్ రోవర్ స్పోర్ట్, హ్యుందాయ్ క్రెటా వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి.

Details

రష్మిక భవిష్యత్‌ ప్రాజెక్టులు

పుష్ప 2‌తో పాటు మరికొన్ని పాన్ ఇండియా ప్రాజెక్టులలో నటిస్తున్న రష్మిక, బాలీవుడ్‌లో కూడా తన స్థానం మెరుగుపరుచుకుంటోంది. 'నేషనల్ క్రష్'‌గా పేరుపొందిన రష్మిక, ఇప్పుడు దేశవ్యాప్తంగా అగ్రశ్రేణి నటీమణులలో ఒకరిగా ఎదిగింది.